పాకిస్థాన్ లో దారుణం జరిగింది. రెండు నెలల గర్భిణీ స్త్రీపై యజమాని కొడుకు అతని నలుగురు మిత్రలు దారుణానికి ఒడిగట్టారు. యజమాని అంచనాలకు తగినట్లుగా పనిచేయలేదనే ఆరోపణలపై.28 ఏళ్ల క్రైస్తవ మహిళను నగ్నంగా వూరేగించారు. సుమారు అరగంట పాటు తనను గ్రామంలో నగ్నంగా పూరేగించారని భాదితురాలు తెలిపింది. పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో షేక్పురా జిల్లా రానా పట్టణంలో క్రైస్తవ కాలనీ నివాసిపై అటవికంగా దారుణ అకృత్యానికి పాల్పడ్డారు. యజమాని కుమారుడు, మరో నలుగురు కలిసి తనను వీధిలోకి ఈడ్చుకోచ్చారని, అక్కడ అమె బట్టలను చింపి వివస్త్రను చేశారని బాధితురాలు తన అక్రంధనను వెళ్లగక్కింది.
అరగంట పాటు తనను వీధి గుండా తరముకుంటూ నడిపించిన వారిని వీధి చివర ఓ వృద్దురాలు అడ్డుకోవడంతో వారు వెనుదిరిగారని చెప్పింది. అమె తనకు బట్టలు ఇచ్చిందని తెలిపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని అస్పత్రిలో చేర్పించారు. యజమాని కోడుకు అతని స్నేహితుల వికృత చర్యల వల్ల తన గర్భాన్ని కోల్పోయినట్లు బాధితురాలు తెలిపింది. అయితే పోలీసులు మాత్రం నిందితులపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని తెలిపింది. నిందితులపై పోలీసులు చర్యలు తీనుకోని పక్షంలో తాను ఆత్మహత్యకు పాల్పడతానని బాధితురాలు హెచ్చరించింది. కాగా పోలీసులు వైద్య నివేదిక తరువాత నిందితులపై కేసు నమోదు చేశారని, అయితే ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కాకుండా.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని బాధితురాలి భర్త తెలిపాడు.
అటవికంగా అడవారిపై వికృత చర్యలకు పాల్పడిన మొబిన్ గొండాల్ అతని నలుగురు మిత్రులపై పాకిస్థాన్ పీనల్ కోడ్ ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు రానా పట్టణం పోలీస్ అధికారి మహ్మద్ ఖాన్ తెలిపారు. తన భార్యను నగ్నంగా ఊరేగించారన్న బాధితురాలి పిర్యాదుపై కేసు నమోదు చేశామని నిందితులను అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిందితులను అరెస్టు చేయని పక్షంలో ఈ ఘటనను నిరసిస్తూ.. పట్టణంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని క్రైస్తవ మతపెద్ద, మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు అస్లాం సహోత్రా హెచ్చరించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more