కమ్మనైన అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనం అమె. అరుదైన వ్యాధితో భాదపడతున్న ఆమె తానో, తన బిడ్డనో బతింకించుకునే అవకాశం మాత్రమే వుంది. తన కడుపులో బిడ్డ మరణిస్తే.. అమె బతుకుతుంది. లేదా బిడ్డ బతకాలంటే.. అమె మరణించాల్సిందే.. ఇదే పరిస్థితి ఎవరికైనా ఎదురైతే.. బిడ్డ కావాలంటే మళ్లి పుడుతుంది. కానీ తాను బతికుండాలని ఆలోచిస్తారు అందరు. కానీ తాను మరణించినా.. పర్వాలేదు.. బిడ్డ మాత్రం బతకాలని మాతృత్వానికి ప్రాముఖ్యతనిచ్చింది ఆ తల్లి. తనను తాను త్యాగం చేసుకుని... పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఆ మాతృమూర్తి.
కరిసా బూగల్ మూర్తీభవించిన మాతృమూర్తి. అగ్రరాజ్యం అమెరికాలోని అరోరా పట్టనంలో నివసిస్తుంది. ఈమె స్థానికంగా లేబర్ గా విధులు నిర్వహించేది. నవంబర్ 3న ఈమె డిక్లాన్ అనే చిన్నారికి జన్మనిచ్చింది. తాను కన్నుమూసింది. ప్రసవానికి కొన్ని నిమిషాల ముందు ఆమె కడుపులో ఉన్న బిడ్డ గుండె కొట్టుకునే వేగం తగ్గిపోవడాన్ని వైద్యులు గమనించారు. ఆమెకు పరీక్షలు చేయగా.. ‘ఎమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబోలిజం’తో బా ధపడుతున్నట్టు తేలింది. లక్ష మందిలో ఒక్కరి నుంచి పన్నెండు మందికి మాత్రమే వచ్చే ఈ వ్యాధి తనకు వచ్చిందని వైద్యులు తెలిపారు.
కడుపులో ఉన్న బిడ్డ తాలూకూ స్రావాలు, జుట్టు వంటివి తల్లి రక్తంలో కలిసిపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఈ అలెర్జీ నుండి తనను తాను కాపాడుకోవాలంటే బిడ్డను చంపాలి. బిడ్డ బతకాలంటే తనను తాను చంపుకోవాలి. ఈ దారుణమైన వ్యాధి ఎందుకు సంక్రమిస్తుందో.. ఎలా సంక్రమిస్తుందో తమకు తెలియదని, కనీసం దీనిని ఎలా కట్టడి చేయాలో కూడా ఇప్పటి వరకు వైద్యరంగ నిపుణులు కనుగోనలేదని అక్కడి వైద్యులు చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేవలం ఒక్కరికి మాత్రమే బతికే అవకాశముందని వైద్యులు తెలిపారు. ఆలస్యం చేస్తే ఇద్దరు మృత్యవాత పడోచ్చని వైద్యులు హెచ్చరించారు. ఈ విషయాన్ని చెప్పగానే కరిసా వెంటనే ఒక నిర్ణయం తీసుకుంది. సిజేరియన్ చేసి తన బిడ్డను బతికించమని కోరడంతో వైద్యులు వెంటనే ఆపరేషన్ చేశారు. కరీసా నిర్ణయాన్ని ఆమె భర్త వెస్ కూడా సమర్థించాడు. డీక్లాన్ పుట్టగానే.. ‘ఎలా ఉన్నాడు’ ఎంత బరువు వున్నాడు. ఆరోగ్యంగా వున్నాడా అని పిల్లాడి గురించి అడిగింది. అంతే ఆ తరువాత అమె ప్రాణాలు అనంతవాయువులో కలసిపోయాయి.
చిన్నారి డిక్లాన్ ను లోకం చూసే వీలు కల్పించిన ఆ తల్లి కరిసా బుగల్ కు అప్పటికే ఒక కూతరు వుంది. తన భార్య పోయిన భాధలో వున్న వెస్.. రోజుల వ్యవధిలోని పుట్టిన బిడ్డను, మరో పసిపాపను ఎలా చూసుకోవాలంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. కాగా గో ఫండ్ మీ సంస్థ ఆధ్వర్యంలోని ఆన్ లైన్ వైబ్ పోర్టల్ ద్వారా కరిసా బుగల్ కోసం నలభై వేల అమెరికన్ డాలర్లను ఇప్పటివరకు సేకరించింది. వాటిని వెస్ కు అందజేస్తామని తెలిపింది. పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే వుండాల్సిన పరిస్థతి రావడంతో.. కొంత కాలం ఆయన జీవనం సాగేందుకు ఈ డబ్బు ఉపయోగపడుతుందని చెప్పింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more