120 కోట్ల మంది ప్రజలున్న భారతావని ఆయన ప్రధాన మంత్రి. ఆయన ఏం చేసినా క్షాణాల్లో గుడ్డిగా ఫాలో అవుతుంటారు భారతీయ యువత. ఆయన ఎక్కడ వున్నా తమకు నిత్యం అందుబాటులో వుంటాడని భారతీయ యువత విశ్వాసం. అందుకు తగ్గట్టుగానే ప్రధాని మోడీ కూడా ఎక్కడ వున్నా, ఏ సమయంలోనైనా భారతీయ యువతతో అందుబాటులోకి వస్తారు. ప్రధానిగా వుంటూ ప్రజలకు అందుబాటులో వుండే ప్రధాని కాబట్టే అయినకు అంత క్రేజ్ అనుకుంటున్నారుగా, ఇది ఒక మాదిరగా కరక్టే.
అయితే నరేంద్రమోడీ అనే పేరు ఇప్పడు కేవలం పేరు కాదు.. ఒక బ్రాండ్ అంటున్నారు యువత అందుకే అయన నిత్యం యువతతో సోషల్ మీడియాలో అందుబాటులో వుంటారు. భారతీయ యువత విశ్వాసాలకు అనుగూణంగా నడుచుకుంటారు. ఆరు పదుల వయస్సులోనూ.. కుర్రాడిలా ముందుకు సాగుతున్నారు. అదెలా అంటారా..? ప్రస్తుతం ఏసియన్ సదస్సు కోసం వెళ్లన ప్రధాని అక్కడ మరో సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ఇన్స్టాగ్రాంలోనూ ఖాతా తెరిచారు. ఫేస్బుక్, ట్విట్టర్లలో ఆయనకు లక్షల కొద్దీ ఫాలోవర్లు ఉన్న సంగతి తెలిసిందే.
ఆన్లైన్లో ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకునే సోషల్ మీడియా వెబ్సైట్ ఇన్స్టాగ్రాం ద్వారానూ మోదీ యువతకు చేరువయ్యారు. మయన్మార్లో ఏసియాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన మోదీ అక్కడ ఆయన స్వయంగా తీసిన ఫొటోను ఇన్స్టాగ్రాంలో అప్లోడ్ చేశారు. 'హలో వరల్డ్! ఇన్స్టాగ్రాంలో చేరడం గొప్ప అనుభూతినిస్తోంది. ఇది ఇస్ ష్టాగ్రాంలో నా తొలి ఫోటో .. ఏసియాన్ సదస్సు నుంచి' అని ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఆయన ఖాతా తెరిచిన రెండు గంటల్లోపే దాదాపు 38వేల మంది ఫాలోవర్లు వచ్చేశారు. ఇన్స్టాగ్రాంలో చేరినట్లు మోదీ ట్విట్టర్లోనూ పోస్ట్ చేశారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more