రాజధాని ప్రతిపాదిత ప్రాంత రైతులు రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలపై మండిపడ్డారు. తమ అనుమానాలను నివృత్తి చేయకుండా భూములను ల్యాండ్ పుల్లింగ్ విధానంతో లాక్కోడాన్ని తాము అంగీకరించమన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించిన పిమ్మట తమ భూములను తీసుకోవచ్చునని తేల్చి చెబుతున్నారు. ఇదే విషయాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో రాజధానికి భూములిచ్చే విషయంలో రైతుల అభిప్రాయూలను సేకరించేందుక వచ్చిన విజయవాడ, గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యులకు తెలిపారు.
తమ భూములు లాక్కొని పొట్టలు కొడతారా? మమ్మల్ని, మా కుటుంబాలను రోడ్లపైకి నెడతారా? మా సమాధులపై అందమైన రాజధాని కడతారా...? అంటూ మండిపడ్డారు. రైతుల అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. ముందుగా భూసేకరణపై నెలకొన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎకరా భూమికి ఎంత డబ్బును పరిహారంగా చెల్లిస్తారో ఖచ్చితంగా చెప్పాలని, ప్రతి ఎకరాకు అభివృద్ధి చేసిన భూమిలో 1,500 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ భూమిని తీసుకున్న చోటే తమకు భూములను ఇవ్వాలన్నారు. రోడ్లు, కరకట్టలకు ఆనుకుని భూములున్న రైతులకు భూసేకరణ అనంతరం అభివృద్ధి చేసి ఇచ్చే భూమిని కూడా రోడ్డు పక్కదే ఇవ్వాలన్నారు.
ల్యాండ్ పుల్లింగ్ విధానంలో భాగంగా తమ భూములను తీసుకుంటున్న ప్రభుత్వం ఎంతకాలంలో తమకు భూములను కేటాయిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల్లో సారవంతమైన 3 పంటలు పండే భూముల్లో కౌలు రూ. 50 వేల వరకు ఉన్న విషయాన్ని గుర్తుంచుకుని అందుకు అనుగూణంగా పరిహారం ఇవ్వాలని కోరారు. పరిహారం కూడా ప్రభుత్వం చెప్పే కాలపరిమితి మొత్తాన్ని లెక్కించి ఒకేసారి ఇవ్వాలని ఈ డిమాండ్లన్నింటినీ ప్రభుత్వానికి తెలియజేయాలని వారు బార్ అసోసియేషన్ సభ్యులను కోరారు. తమకు ఇచ్చే పరిహారం, భూముల కేటాయింపులను ప్రభుత్వ హామీలుగా కాక శాసనసభలో చట్టం చేసిన తరువాతే భూసేకరణకు చర్యలు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more