ఐటి ఉద్యోగాలపై కోటి ఆశలతో ఎదురుచూస్తున్న యువతకు క్రిసిల సర్వే చేదువార్తను చెప్పింది. రానున్న నాలుగు సంవత్సరాల్లో యవతకు ఐటి ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పింది. ఉద్యోగ నియమకాలపై ఐటి కంపనీలు అనుసరిస్తున్న విధానాలపై క్రిసిల్ సర్వే చేసింది. తమ విశ్లేషణలో దేశంలో ఐటీ పరిశ్రమ రోజురోజుకూ వృద్ది చెందుతున్నట్లు తెలిపింది. ఐటీ వృద్ది, రాబడి 13శాతం నుంచి 15శాతంకు వృద్ధి ఉంటుందని చెప్పిది. కంపనీలు వృద్ధి చెందినా ఉద్యోగ అవకాశాలు మాత్రం పెరగకుండా విచిత్రంగా తగ్గుతున్నాయని వెల్లడించింది.
ఇందుకు కంపనీల ఆలోచనావిధానం కారణమట. అంటే లాభాలను పెంచుకునేందుకు కంపనీలు ఎక్కువగా ఆసక్తి చూపుతూ మానవ వనరుల వినియోగం తగ్గించే భావనలో ఉన్నాయి. ఫలితంగా ఆదాయం పెరుగుతున్నా ఉద్యోగాలు మాత్రం భారీగా తగ్గుతాయని క్రిసిల్ పేర్కొంది. ప్రస్తుతం ఇంజనీరింగ్, ఐటి కోర్సులు చేస్తున్న యువతకు ఉపాధి విషయానికి వస్తే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని తెలుస్తోంది. ఇదే జరిగితే దేశంలో ఐటి రంగంపై ఆశలు పెట్టుకున్న యువత నిరుద్యోగులుగా మిగులుతారు.
భారత్ లో ప్రైవేటు రంగంలో ఐటి మాత్రమే ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం. ఆ తర్వాత సాఫ్ట్ వేర్, కస్టమర్ సర్వీస్ ఇతర రంగాలు ఉన్నాయి. ఐటీలో చిన్న స్థాయి నుంచి లక్షల రూపాయలు ఆర్జించే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. కంపనీలకు పెరుగుతున్న ప్రాజెక్టుల కారణంగా ఆదాయం పెరుగుతున్నా, లాభార్జనపై దృష్టిపెట్టి కొత్త వనరుల్ని తీసుకోవటం లేదు. ఫలితంగా నైపుణ్యం ఉన్న యువత నిరుద్యోగులుగా మిగిలి దుస్థితి ఏర్పడుతోంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more