ఉప్పల్ స్టేడియానికి కిస్ ఆప్ లవ్ పాకింది. ఇద్దరు సెలబ్రిటీలు మరో ఇద్దరి సెలబ్రీటీలను ఉప్పల్ స్టేడియం వేదికగా కిస్ చేసి సంచలనం రేకెత్తించారు. ఇందుకు ఉప్పల్ లో క్రికెట్ అభిమానులు సాక్షులుగా నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి, ఉద్యమ సారధి ఏదీ చేసినా కొంత వైవిధ్యంగానే వుంటుంది. ఆయన అభిమానాన్ని తట్టుకోవడం కూడా కొంచెం ఇబ్బందికరంగానే వుంటుంది. ఇది ప్రస్తుత టీమిండియా ఆటగాడు, హైదరాబాద్ మాజీ ఆటగాడు అంబటి రాయుడికి ఎదురైంది. అంబటి రాయుడిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పద్ధతిలో పలకరించారు. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా హాజరైన కేసీఆర్ .. ముందుగా ఇరు జట్ల ఆటగాళ్లను పరిచయం చేసుకున్నారు. అయితే ఆటగాళ్ల అందర్నీ కరచాలనంతో పరిచయం చేసుకున్న కేసీఆర్.. రాయుడి చేతిని మాత్రం దగ్గరకు తీసుకుని ముద్దాడారు.
ప్రస్తుతం బరోడా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయుడు.. గతంలో హైదరాబాద్ జట్టు తరపున ఐపీఎల్ లో ఆడాడు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ రాయుడిని ప్రత్యేక పద్ధతిలో పరిచయం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాజధాని హైదరాబాద్ లో జరిగే తొలి వన్డే మ్యాచ్ కావడంతో కేసీఆర్ ను ఆహ్వానించిన హెచ్ సీఏ పెద్దలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అయితే అందరి సహచర మిత్రుల మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి తనను ప్రత్యేకంగా పలకరించడం రాయుడు కొంత ఇబ్బందికరంగానే ఫీలయ్యారు.
ఇక సాయంత్రానికి నిజంగానే లవర్స్ కిస్ ఆప్ లవ్ అవిష్కరించింది. భారత ఇన్నింగ్స్ సమయానికి కోహ్లి గర్ల్ఫ్రెండ్, సినీనటి అనుష్క శర్మ స్టేడియానికి వచ్చింది. క్రికెట్ ఆడుతున్నంత సేపూ ఏ మాత్రం ఖాళీ దొరికినా అనుష్కను చూసిన విరాట్... అర్ధసెంచరీ పూర్తి కాగానే గర్ల్ఫ్రెండ్కు బ్యాట్తో కిస్ కొట్టాడు. దీనికి అనుష్క కూడా స్పందించి సిగ్గుపడుతూ మురిసింది. దీంతో స్టేడియానికి వచ్చిన లవర్స్ కూడా పనిలో పనిగా కిస్ ఇచ్చుకున్నారట.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more