పాకిస్థాన్ తివ్రవాద దేశంగా క్రమంగా మారుతోంది. ఇప్పటికే తాలిబన్ టెరరిస్టు దళాలు పాకిస్థాన్ లోని అనేక ప్రాంతాల్లో పట్టు సాధించగా, చాపకింద నీరులా ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) తీవ్రవాదం కూడా క్రమంగా పాకిస్థాన్ లో వేళ్లూనుకుంటోంది. ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ నుంచి ముప్పు పెరుగుతోందంటూ పాకిస్థాన్ భద్రతా దళాలు ఆ దేశ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు ఓ మీడియా నివేదిక వెల్లడించింది. హంగూ జిల్లాలోని ఖైబర్ పక్తుంక్వా, కుర్రం గిరిజన జిల్లాలనుంచి పదివేల నుంచి పన్నెండు వేల మంది అనుచరులను ఐఎస్ నియమించుకుందని అక్టోబరు 31న ''ద డాన్'' తన వెబ్సైట్లో ''రహస్య సమాచార నివేదిక'' పేరున వెల్లడించింది.
మధ్య తూర్పు తీవ్రవాద సంస్థ (దాయిష్) కార్యక్రమాలు ఉద్ధృతమవుతున్నాయని హెచ్చరిస్తూ బలూచిస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికలో సమాఖ్య ప్రభుత్వానికి విషయాన్ని చేరవేసింది. హోం శాఖ తో పాటు బలుచిస్థాన్ ట్రైబల్ శాఖ నుంచి కూడా ఇస్లామిక్ తీవ్రవాదం విస్తరిస్తున్నట్లు నివేదిక పంపినట్టు తెలుస్తోంది. లష్కరే ఇ జాంగ్వీ సహా అల్ సున్నత్ వాయ్ జమత్ సంస్థలను తమకు సాయం చేయాల్సిందిగా ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ కోరినట్లు సమాచారం. ఇందుకు గాను వారికి పలు అంశాలలో ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ సహకారం అందించేందుకు ఒప్పందం చేసుకుందని కూడా తెలుస్తోంది.
ఉత్తర వజీరిస్థాన్ లోని ఖైబర్ పక్తుంక్వాలో వున్న ప్రభుత్వ భవనాలు, సైన్యం స్థావరాలపై దాడులకు పాల్పడడానికి ఐఎస్ ప్రణాళికలు రచిస్తోందని, షియా మైనారిటీ వర్గాలను కూడా లక్ష్యంగా చేసుకొంటుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బలూచిస్థాన్ ప్రభుత్వం భద్రత, నిఘా కార్యక్రమాలను కట్టుదిట్టం చేసింది. ఐఎస్ ఇక్కడ ఉన్నట్లు ఇప్పటికీ అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే తీవ్రవాద దాడులు చేస్తారన్న సమాచారంతో భద్రతను ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసింది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more