పర్యావరణానాన్ని కాపాడండీ అంటూ శాస్త్రవేత్తలు ప్రపంచ దేశాలకు ఇప్పటికే పలుమార్లు విన్నపాలను పంపారు. నేరుగా కూడా విన్నవించారు. అసలు పర్యావరణాన్ని మనం కాపాడటం ఏంటీ, మనకు దాంతో పనేంటి అనుకుంటున్నారా..? పర్యావరణం పరిరక్షణ కాదు ముందు అభివృద్దిలో దూసుకుపోవాలన్నదే లక్ష్యం అనుకోవడం తప్పు. అందనంత అభివృద్ది భవిష్యత్ తరాలకు ఇచ్చి.. పర్యావరణ సమతుల్యత లేకపోతే వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారదా.? ధీనికి కారణమైన తరాలను భావి తరాలు క్షమిస్తాయా..? పారిశ్రామిక అభివృద్ది ఒక్కటే కాదు.. పర్యావరణ సమతుల్యతపై కూడా దృష్టి సారించాల్సిన సమయం అసన్నమైంది.
ఇప్పటికే రుతువులు గతి తప్పుతున్నాయ్.. తుఫానులు వస్తే తప్ప వర్షాలు పడని పరిస్థితి. తుఫాన్లు, వరదలు, దుర్భిక్షాలు మానవాళిని భయపెడుతున్నాయి. భూ మండలాన్ని వేల సంవత్సరాలుగా పదిలంగా కాపాడుతున్న ప్రకృతిని చేజేతులా నాశనం చేసేస్తున్నాం. తొందరగా ఎదగాలనే పరుగులో తుళ్లిపడిపోతున్నాం. అభివృద్ధి అవసరమే.. కానీ, రేపటి రోజు అనేది మిగలకుండా జరిగే దానిని అభివృద్ధి అని ఎలా అనగలం? గాంధీజీ వంటి మహనీయుల మార్గదర్శకత్వంలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. కానీ, ప్రకృతికి హాని కలిగించని సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శం కావాలంటున్నారు అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారుడు, గ్రంథ రచయిత బిల్ మెక్ కిబెన్. ప్రకృతి పరిరక్షణపై 16 గ్రంథాలను రచించిన ఆయన.. ‘350 డిగ్రీస్’ సంస్థను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణపై ఉద్యమాలు చేపడుతున్నారు. గాంధీ మార్గం ఆదర్శం కావాలనే ఆయన గత ఏడాది గాంధీ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన అవగాహన కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన మెక్ కిబెన్ మీడియాతో ముచ్చటించారు
ప్రకృతిని ఆరాధించే సంస్కృతి భారతీయుల సొంతం. కానీ, కోట్లాది మంది ప్రజలు ప్రకృతి ఆగ్రహానికి గురై సర్వస్వం కోల్పోతున్నారు. కార ణాలు ఏమిటంటారు?
కశ్మీర్ వరదలు, విశాఖలో హుద్ హుద్ తుఫాన్ బీభత్సాలను మరచిపోకముందే తాజాగా మరో తుఫాన్ కోస్తా తీరవాసుల్ని భయపెడుతోంది. భారత్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. న్యూయార్క్ను వరదలు ముంచెత్తితే.. కాలిఫోర్నియా దుర్భిక్షంతో అల్లాడుతోంది. కొంత కాలంగా మనమంతా ప్రకృతిని ధ్వంసం చేసుకోవడమే ప్రస్తుత దుస్థితికి కారణం. ఎగువన అడవులు నరికి వేయకపోతే కశ్మీర్లో ఆ స్థాయిలో వరదలు వచ్చేవి కావు. సముద్రతీరంలో చెట్లు పెంచి ఉంటే విశాఖలో నష్టం తక్కువగా ఉం డేది. ప్రకృతి కన్నెర్ర చేస్తోందని బాధ పడుతున్నాం కానీ, అందుకు కారణం మనమేనని చాలామంది గుర్తించడం లేదు.
అభివృద్ధి క్రమంలో ఇవన్నీ కొంతవరకు సహజమనే వాదన ఉంది కదా?
మంచి భవిష్యత్తును అందించే దానిని అభివృద్ధి అం టారు. కానీ, భవిష్యత్తును అంధకారంలో పడవేసే దానిని అ భివృద్ధి అని ఎలా అంటాం? అడ్డూ అదుపూ లేకుండా ఇం ధనాన్ని ఉపయోగించుకుంటున్నాం. భవిష్యత్తు తరాలకు అవసరమైన ఇంధనాన్నీ మనం ఇప్పుడే వాడేస్తున్నాం! ఇక ముందు తరాలు ఎలా బతకాలి? అభివృద్ధి పేరిట చెట్లు నరికేసి కాంక్రీట్ భవనాలు నిర్మిస్తున్నాం. రేడియేషన్ పెరిగిపోయి అనారోగ్యం పాలవుతున్నాం. వేగంగా పట్టణీకరణ జరగడం వల్ల సౌకర్యాలు పెరుగుతాయేమో కానీ భవిష్యత్తు అంధకారమవుతుంది. హైదరాబాద్లో చాలా మంది ముఖానికి గుడ్డలు కట్టుకుని ప్రయాణం చేయడాన్ని గమనించాను. కాలుష్యానికి భయపడి ఈ తరం వారు అలా బతికేస్తున్నారు సరే. ఎలాంటి మాస్క్లు కట్టి వారి పిల్లల్ని కాపాడుకుంటారు? నగరం మధ్యలో ఉన్న హుస్సేన్ సాగర్ జలాలను కలుషితం చేసుకున్నాం. దానివల్ల ముందు తరాలు జబ్బుల బారిన పడితే అందుకు ఎవరు బాధ్యులు? ఇదేనా మనం సాధిస్తున్న అభివృద్ధి? నేను పాతికేళ్ల కిందట ‘ది ఎండ్ అఫ్ నేచర్’ అనే పుస్తకాన్ని రచించాను. ఆ పుస్తకంలో నేను చెప్పిన దానికంటే వేగంగా భూ మండలం ప్రమాదంలో పడుతోంది. ప్రకృతిని పరిరక్షించుకుంటూ అభివృద్ధి చెందే విధానాలు చేపట్టినప్పుడు మనతో పాటు ముందు తరాలూ చల్లగా ఉంటాయి.
దుర్భిక్షాలు, వరదలు, తుఫాన్ల వంటి ప్రకృతి విపత్తులు నివారించడానికి ఏం చేయాలంటారు?
పర్యావరణ మార్పులతో భూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ప్రకృతి విపత్తులకు ఇదే ప్రధాన కారణం. ‘ప్రకృతి మనదే కదా.. ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు’ అనే భావన ప్రతి ఒక్కరిలో పెరిగిపోయింది. ఇంధనాన్ని యధేచ్ఛగా వాడుతూ వ్యర్థాలను గాలిలోకి వదులుతున్నాం. ప్రస్తుతం ఉపయోగిస్తున్న రీతిలో ఇంధనాన్ని ఉపయోగిస్తూపోతే 40 ఏళ్ల తర్వాత చమురు నిల్వలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. విద్యుత్ సంక్షోభం తీవ్రమై ప్రాంతాల మధ్య వివాదాలకు దారితీయడాన్ని గమనిస్తున్నాం. ప్రకృతి విపత్తులతోపాటు, పర్యావరణ పరిస్థితుల కారణంగా వరి, గోధుమ పంటల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంధనాన్ని పొదుపు చేయడం ప్రతి ఒక్క పౌరుడి ధర్మం. ప్రకృతికి హాని కలిగించని ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టిసారించాలి. ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ ఇదే విషయాన్ని చెబుతున్నాను.
ప్రత్యామ్నాయ ఇంధనం అంటే....?
సౌర, పవన విద్యుదుత్పత్తిపై దృష్టిసారించాలి. సౌర విద్యుదుత్పత్తికి భారత్లో అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రభుత్వాలు కూడా దీనిని ప్రోత్సహించడం ఆనందించాల్సిన విషయం. అయితే, ఇవే ప్రభుత్వాలు కోస్తా తీరంలో అణు ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు విన్నాను. ఇది లాభసాటి కాకపోగా ప్రమాదకరం. అందుకే పలు ప్ర పంచ దేశాలు అణు ఇంధన ఉత్పత్తికి విముఖంగా ఉన్నా యి. అలాంటిది కోస్తా తీరంలో అణు ఇంధన కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం విడ్డూరం.
కరెంట్, పెట్రోలు లేని జీవితాన్ని ఊహించడం కష్టం. ఇంధనం కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఎలాంటి జీవన విధానం అవలంబించాలంటారు?
డెన్మార్క్, బ్రిటన్ దేశాల్లో ప్రజలు వాహనాలు వదిలేసి సైకిళ్లను ఉపయోగిస్తున్నారు. దగ్గర ప్రాంతాలకు చాలా మంది నడిచే వెళుతున్నారు. నా వరకు నేను అమెరికాలోని వెర్మౌంట్లోని ఎత్తయిన, ప్రశాంత ప్రదేశంలో ఉంటాను. ఎంత దూరమైన నడిచి వెళతాను. 350 డిగ్రీస్ సంస్థను ఏర్పాటు చేసి భూ మండల పరిరక్షణపై చైతన్యం కలిగిస్తున్నాను. ప్రపంచానికే నిరాడంబరత నేర్పిన గాంధీ పుట్టిన దేశం ఇది. కానీ, ప్రగతి పేరిట ఇప్పుడంతా పరుగులు తీస్తున్నారు. ఆ తొందరలో కిందపడుతున్నారు. హైదరాబాద్లో రోడ్ల మీద మనుషులు కనిపించడం లేదు. రోడ్లనిండా కార్లే కనిపిస్తున్నాయి. ఇదీ మనం సాధిస్తున్న అభివృద్ధి. ఆర్భాటాలతో కూడిన జీవన విధానం భవిష్యత్తును చీకటిమయం చే స్తున్నప్పుడు దాన్ని వదిలేయాలి. ముఖ్యంగా యువత ఇం దుకు నడుం కట్టాలి. చమురు, విద్యుత్ వంటి ఇంధన వనరుల్ని పరిరక్షించే విషయంలో కీలక పాత్ర పోషించాలి. శాస్త్రవేత్తలు, మేధావులు ప్రజల్లో ఈ మేరకు అవగాహన పెంపొందించినప్పుడే భూమండలం క్షేమంగా ఉంటుంది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more