హుద్దూద్ తుపాను ప్రభావానికి కాకవికళమైన విశాఖ సహా కోస్తా తీరానికి మరో తుఫాను ముప్పు పోంచి వుంది. హుద్దూద్ బీభత్సం సృష్టించిన నష్టాలను అంచనాలు వేసుకుంటున్న తరుణంలో.. తమ తీరానికి మరో తుపాన్ ముప్పు పొంచి ఉందని తెలిసి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింత బలపడుతూ కోస్తా వైపు కదులుతోంది. నిన్నరాత్రికి ఈ తీవ్రవాయుగుండం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 560 కిలోమీటర్లు, ఒడిశాలోని పారదీప్కు దక్షిణ ఆగ్నేయంగా 690 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకతమై ఉంది.
ఇది క్రమంగా బలపడి మరికొన్ని గంటల్లో తుపాను ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండం గత 12గంటలుగా స్థిరంగా కొనసాగుతోంది. ఇది క్రమంగా వాయువ్యదిశగా పయనించి మరో 12 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ తుపానుకు శ్రీలంక దేశం సూచించిన 'అశోబా' అనే పేరును ఖరారు చేయనున్నారు. అశోబా క్రమంగా పశ్చిమ వాయువ్యదిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు రానుంది.
అయితే అశోబా తీరానికి సమీపించే కొద్దీ ... తుపాను క్రమంగా వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం ఒంగోలుకు తూర్పు ఆగ్నేయ దిశలో 750, విశాఖకు ఆగ్నేయ దిశలో 560, పారాదీప్కు దక్షిణ ఆగ్నేయ దిశలో 690 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి రేపటి నుంచి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్న జాలర్లు తీరానికి చేరుకోవాలని అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. అటు ఒడిశాలో కూడా బలమైన గాలులతొ కూడిన వర్షాలు వీస్తాయని, అధికారులు హెచ్చరించారు. ఇటు తెలంగాణలోనూ పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగత్రలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు.
అశోబా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలహీనపడుతూ తొమ్మిదో తేదీ ఉదయానికి కోస్తాలో తీరాన్ని దాటవచ్చని తెలిపింది. తుఫాన్గా మారకుండానే వాయుగుండంగానే కోస్తాలో తీరం దాటవచ్చని ఐఎండీ అంచనా వేసింది. అయితే తుపాను నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైంది. వాయుగుండంగా మారి తీరాన్ని దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ.. అలా జరగని పక్షంలో తీరప్రాంతంలో ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ అధికారులకు అదేశాలు జారీ చేసింది. ప్రభావిత ప్రాంతాలలో అధికారులు నిరంతరం సేవలు అందించేందుకు సిద్దంగా వుండాలని ఆదేశించింది. ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. తుఫాను ప్రభావం అధికంగా వుండే ప్రాంతాలలోని ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలను జారీ చేసింది.
జి, మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more