ఉపఖండంపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు మరోసారి సిద్ధం అవుతున్నారు. భారత్ పై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని దేశ ఇంటలిజెన్స్ హెచ్చరించింది. దేశంపై పన్నుతున్న కుట్రలపై తమకు సమాచారం అందిందని స్పష్టం చేసింది. ముఖ్యంగా కోల్ కతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సముద్ర మార్గంలో వచ్చి దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఆల్ ఖైదా ఉగ్రవాదులు కోల్ కతా ఓడరేవుపై దాడి చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హై అలర్ట్ ప్రకటించింది.
గత పరిణామాలు, దాడులను విశ్లేషించిన ఇంటలిజెన్స్ గతంలో కూడా దాడులకు ముందు సముద్ర మార్గం ద్వారానే దేశంలోకి ఉగ్రవాదులు ప్రవేశించే ఆస్కారం ఉందని చెప్పారు. తాజా హెచ్చరికలతో నేవి అప్రమత్తమైంది. యుధ్ద నౌకలు ఐఎన్ఎస్ పృథ్వి, ఐఎన్ఎస్ సుమిత్రలను వెంటనే సముద్రంలోకి పంపటం జరిగింది. వాస్తవానికి నేవి ఉత్సవాల నేపథ్యంలో రెండూ తీరంలో వేడుకల్లో పాల్గొంటున్నాయి. అయితే ఇంటలిజెన్స్ హెచ్చరికలతో వీటిని ఉన్నపళంగా సముద్రంలో రక్షణ కోసం పంపించారు. ఈ మేరకు రక్షణ మంత్రి కూడా ప్రకటన చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే యుద్ధనౌకలు సముద్రంలోకి వెళ్లాయన్నారు.
అటు కోల్ కతా ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించింది. తీర ప్రాంతంతో పాటు.., కోల్ కతాలోని కీలక ప్రాంతాలు, రాష్ర్టంలని ముఖ్య నగరాల్లో బందోబస్తు, తనిఖీలు పెంచాలని ఆదేశించింది. దేశంలో బ్రాంచి విస్తరణ దిశగా గతంలో చర్యలు చేపట్టిన ఆల్ ఖైదా తాజాగా దాడులు చేస్తుందని సమాచారం రావటంతో అంతా అప్రమత్తం అయ్యారు. అనుమానితుల కదలికలపై కూడా గట్టి నిఘా పెట్టారు. జనరద్దీ కలిగి ఉండే చారిత్రక నగరంపై ఉగ్రవాదులు దాడి చేస్తే నష్టాన్ని ఊహించటం చాలా కష్టం అవుతుంది. దీంతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించి అప్రమత్తంగా పరిస్థితిని సమీక్షిస్తోంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more