దేశ రాజకీయాల్లో ప్రభావశీల శక్తిగా దూసుకుపోతున్న ప్రధాని నరేంద్ర మోదీకి చేరవయ్యేందుకు డీఎంకే చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ప్రధాని అపాయింట్ మెంట్ కోరిన డీఎంకే అధినేత కరుణానిధి తనయ, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి బృందానికి దేశ రాజధాని హస్తినలో పరాభవం ఎదురైంది. కనిమొళి నేతృత్వంలోని బృందాన్ని కలుసుకునేందుకు ప్రధాని మోడీ నిరాకరించారు. దీంతో షాక్ తిన్న కనిమొళి బృందం చేసేది లేక చెన్నైకి చేరుకున్నారు. ఎంపీలను కలుసుకుని వారికి కావాల్సిన సహాయ సహకారాలను అందించేందుకు ముందంజలో వున్న మోడీ కనిమొళి బృందాన్ని కలవడానికి ఎందుకు నిరాకరించారు.?
టెలికాం రంగంలో వచ్చిన సాంకేతిక విప్లవం 2జీని ఇష్టానుసారం కేటియింపులు జరిపి.. అక్రమంగా లక్షల కోట్ల రూపాయలను ఆర్జించిన కుంభకోణంలో నిందితులుగా వున్నందునే వారిని ప్రధాని కలుసుకోలేదా..? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి రాజా ప్రధాన సూత్రధారి కాగా, కనిమొళి పాత్రధారిగా సీబీఐ కేసులు పెట్టింది. అంతేగాక 2 జీ స్పెక్ట్రంకు చెందిన నిధులు అక్రమ మార్గంలో కలైంజర్ టీవీ చానల్కి చేరాయని ఆరోపిస్తున్న సీబీఐ ఆ చానల్ డెరైక్టర్గా వ్యవహరిస్తున్న కరుణ సతీమణి దయాళు అమ్మాళ్ను కూడా కేసులో చేర్చింది. కరుణ సోదరి కుమారుడైన మరో మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్పై కూడా సీబీఐ కేసులు ఉన్నాయి. పదేళ్ల యూపీఏ పాలనలో కేంద్ర కేబినెట్ మంత్రులుగా ఉంటూ కోట్లాది రూపాయల కుంభకోణాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న వీరంతా కరుణ కుటుంబీకులు కావడంతో పాటు డీఎంకే నేతలు కూడా కావడం గమనార్హం. అసలు ప్రధానిని డీఎంకే నేతలు ఎందుక కలవాలనుకుంటున్నారు..?
ప్రకృతి విలయానికి సుందర కాశ్మీరం అల్లకల్లోలం కాగా అక్కడి సహాయక చర్యల కోసం భూరి విరాళాలు అందజేయాలని ప్రధాని మోదీ ఇటీవల దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ రాజకీయాలను ఒక్కసారిగా తమవైపు తిప్పుకునేందుకు ఇదే మంచి తరుణంగా కరుణ భావించారు. అంతేగాక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చేరువ కావడం ద్వారా అన్నాడీఎంకేకు చెక్పెట్టాలని ఎత్తువేశారు. ప్రధాని ఇచ్చిన పిలుపునకు స్పందించి కాశ్మీర్ వరద బాధితుల సహాయార్థం రూ.25 లక్షల విరాళాన్ని సెప్టెంబర్ 13న కరుణ ప్రకటించారు. విరాళ చెక్కును కనిమొళి నేతృత్వంలోని డీఎంకే ఎంపీల బృందం స్వయంగా ప్రధానికి అందజేస్తుందని స్పష్టం చేశారు. ఆ తరువాత కనిమొళి నేతృత్వంలో డిఎంకే ప్రతినిధుల బృందం ఢిల్లీకి చేరుకుని, చెక్ అందించేందుకు ప్రధాని కార్యాలయంలో అపాయింట్మెంట్కు విజ్ఞప్తి చేసుకున్నారు. దాదాపు నెలరోజులు గడుస్తున్నా ఇంత వరకు పీఎంవో నుంచి పిలుపురాలేదు. అనేక సార్లు చేసిన యత్నాలు విఫలం కావడంతో విసుగుచెందిన డీఎంకే నేతలు తిరిగి చెన్నైకి చేరుకున్నారు.
అక్రమార్కులకు మోదీ దూరం
ఈ వ్యవహారంపై ఢిల్లీకి చెందిన బీజేపీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ, వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సొంత పార్టీ (బీజేపీ) నేతలనే మోదీ దూరం పెట్టారని, ఇటువంటి పరిస్థితిల్లో 2 జీ స్పెక్ట్రం కుంభకోణంలో కూరుకుపోయిన కనిమొళిని ఆయన ఎలా కలుసుకుంటారని వ్యాఖ్యానించారు. కాశ్మీర్ బాధితుల సహాయార్థం చెక్కును అందజేసే సందర్భంగా మోదీ, కనిమొళి కలిసినా జాతీయస్థాయిలో వివాదాస్పద చర్చకు తావిచ్చినట్లు అవుతుందని ఆయన అన్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more