ఇటీవల విశాఖ సహా ఉత్తరకోస్తా తీరంలో పెనుబీభత్సాన్ని సృష్టించిన హుద్ హుద్ తుపాను విలయతాండవాన్ని మరువక ముందే భారతావనిని మరోమారు కాకావికళం చేయడానికి మరో తుపాను పొంచి వుంది. అరేబియా సముద్రాన్ని కేంద్రంగా చేసుకుని ఆవిర్భవించిన నీలోఫర్ తుపాను ఈనెల 31వ తేదీ రాత్రి గుజరాత్లోని కచ్ జిల్లాలో తీరాన్ని దాటనుందని భారత వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే ఇంతకు ముందుగా వూహించినట్లు ఇది పెను తుపాను కాదని, వేగాన్ని తగ్గించుకుంటూ శాంతిస్తూ ముందుకు కదులుతుందని అధికారులు చెబుతున్నారు.
ఈ నెల 31న కచ్ వద్ద నీలోఫర్ తీరాన్ని దాటనుందన్న హెచ్చరికలతో గుజరాత్ అధికారులు వేలాది మంది కోస్తా తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కచ్ వద్ద తుపాను తీరం దాటే సమయానికి దాని తీవ్రత అంతగా వుండదని అధికరాలు చెబతున్నా.. ప్రజల ప్రాణాలను పనంగా పెట్టే సహాసానికి ఒడిగట్టలేమని గుజరాత్ అధికారులు చెబుతున్నారు. తీరం దాటే సమయానికి పెను తుపాను కాస్తా తుపానుగా మారుతుందని, తీరం దాటగానే అది పూర్తిగా శాంతిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముందు ఊహించినట్టుగా ఇది గంటకు 220 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో రాదని, కేవలం 60 నుంచ 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు.
కచ్ జిల్లాలోని 30 వేల మంది కోస్తా తీర ప్రజలను అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలు తరలించారు. కచ్ తో పాటు సౌరాష్ట్ర జిల్లాలోని తీర ప్రాంతవాసులను కూడా అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు. నీలోఫర్ కారణంగా ఈ రెండు జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తుందని తెలిపారు. కచ్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయి. నిలోఫర్ ప్రభావం వల్ల రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయి. తీర ప్రాంతాలైన వెరావల్, సోమనాథ్, పోర్బందర్, ఒఖా, ద్వారా, జామ్నగర్లపై నిలోఫర్ ప్రభావం ఉంటుంది. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని హెచ్చరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విప్తత్తు నిరోధక దళం బృందాలను రంగంలోకి దిగాయని అధికారులు తెలిపారు.
ఉతృతంగా వస్తున్న నీలోఫర్ తుపాను ఎంత నష్టాన్ని కలగజేస్తుందని తాము అందోళనలో వున్నామని, అయితే ఊహించనంత వేగంగా రావడం లేదన్న వార్తలు తమకు ఉపశమనాన్ని ఇస్తున్నాయని గుజరాత్ ముఖ్యమంత్రి అనందిబెన్ అన్నారు. తుపాను వేగం పూర్తిగా తగ్గాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని అమె అన్నారు. విపత్తు సృష్టించేందుక వస్తున్న తుఫానుపై ఆమె సమీక్షలు నిర్వహించారు. తుపాను ప్రభావిత తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించానలి ఆనందిబెన్ ఆదేశించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more