మానవ ఆరోగ్యానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు సహజంగా లభించే ఆహారపదార్థాల్లో పుష్కలంగా లభ్యమవుతాయి. అటువంటివాటిల్లో పచ్చిబొప్పాయి ఒకటి! సాధారణంగా ప్రతిఒక్కరు పండిన బొప్పాయిలనే ఎక్కువగా తినడటానికి ఇష్టపడతారు కానీ.. ఆరోగ్యానికి కావలసిన పోషకపదార్థాల రీత్యా పచ్చిబొప్పాయి తినడమే ఎంతో మేలని నిపుణులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. పండిన బొప్పాయిల్లో కూడా పోషకాలు వుంటాయి కానీ.. పచ్చిబొప్పాయిల్లో వుంటే పోషకాల కంటే తక్కువేనని కొన్ని పరిశోధనల ద్వారా శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ ఏ తదితరులతోపాటు ఇంకా చాలా పోషకాలు వుంటాయని స్పష్టం చేస్తున్నారు.
పచ్చిబొప్పాయిలో వుండే పోషకాలు మానవుని ఆరోగ్యంతోపాటు శరీరాకృతిని, అందాన్ని మరింతగా మెరుగుపరుస్తాయి. ఇందులో వుండే పోషకవిలువలు, ఎంజైములు శరీరంలో వుండే జీర్ణవ్యవస్థను మెరుగుపర్చడంలో ప్రముఖపాత్రను పోషిస్తాయి. ఈ పండుతో అమీబియాసిస్, నులిపురుగుల బెడద చాలావరకు తప్పుతుందని.. తద్వారా, అజీర్ణం, పుల్లని తేన్పులు వంటి బాధలు నెమ్మదిగా దూరమవుతాయి. ప్రతి 100 గ్రాముల పచ్చి బొప్పాయిలో కేవలం 39 కెలోరీలు మాత్రమే ఉంటాయి కాబట్టి దీన్ని తినడం ద్వారా శరీరంలో అనవసరంగా కొవ్వు చేరే అవకాశమే వుండదు. దీన్ని సలాడ్ల రూపంలోనూ, జ్యూస్ గానూ తీసుకోవచ్చు.
అలాగే ఇందులో వుండే కొన్ని పోషకాలు ముఖంపై వుండే మొటిమలు, మచ్చలతోపాటు పలురకాల చర్మవ్యాధులను పూర్తిగా నయంచేయడంలో చాలావరకు దోహదపడుతాయి. చర్మానికి చెందిన మృతకణాలను తొలగించి.. కొత్తకాంతిని అందించి మరింత సౌందర్యంగా కనిపించేందుకు సహాయపడుతుందీ బొప్పాయి! శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరగడంలో దీనిపాత్ర అమోఘం! రక్తపోటు స్థాయిని నిరంతరం సరైన స్థితిలో వుంచుతూ.. గుండెకు సంబంధించిన వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఇక, బొప్పాయి ఆకులను చింతపండు, ఉప్పుతో కలిపి తీసుకుంటే మహిళల్లో బహిష్టు కారక నొప్పులు తగ్గుముఖం పడతాయి.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more