శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందని పెవ్దలు చెప్పిన మాట ఎన్నటికీ తప్పుకాదు. అది నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుట్టం రాజు వారి కండ్రిగ గ్రామం. ఆ గ్రామం పేరు నిన్న మొన్నటి వరకు చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు దత్తత తీసుకోవడమే దీనికి కారణం.
ఒక పంచాయతీలో ఆవాసంగా ఉన్న ఆ గ్రామాన్ని స్వర్ణ గ్రామంగా, సకల సౌకర్యాలతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దబోతున్నారు సచిన్. గాంధీజీ కలలు కన్న పల్లెసీమగా, ప్రధాని నరేంద్ర మోదీ ఆశయానికి అనుగుణంగా మేక్ ఇన్ ఇండియాలో ఆ గ్రామం భాగం కాబోతోంది. పల్లెసీమ అంటే ఈ విధంగానే ఉండాలి అనేవిధంగా రూపుదిద్దేందుకు ప్రణాళికలు రూపొందాయి. దీనికి అవసరమైన నిధులు టెండూల్కర్ తన ఎంపీ కోటా నిధుల నుంచి మూడున్నర కోట్ల రూపాయలను అందించనున్నారు. మరికొన్ని సొంతగా సమకూర్చనున్నారు. ఈ అభివృద్ధి పనులను తిలకించేందుకు స్వయంగా సచిన్ టెండూల్కర్ ఆ గ్రామాన్ని సందర్శించనున్నారు. నవంబరు 16న రానున్నట్లు అధికారులకు సమాచారం అందింది.
అయితే సచిన్ పర్యటన ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో ఆ గ్రామాన్ని 'ఈనాడు-ఈటీవీ' బృందం శుక్రవారం పరిశీలించింది. సచిన్ టెండూల్కర్ తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నారన్న సమాచారంతో గ్రామస్థులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కనీసం శాసనసభ్యులూ సందర్శించని తమ గ్రామానికి టెండూల్కర్ రాబోతున్నారన్న సమాచారంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదృష్టం పడితే.. ఎలా వుంటుందో మరికొన్ని సంవత్సరాల్లో ఈ గ్రామమే చూపుతుందని గ్రామస్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ గ్రామ అవసరాల కోసం ఏ ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని ధీమాతో వున్నారు. ఈ ప్రాంతం అభివృద్ది చెందాలి.. దాని ఫలాలను మరిన్ని పల్లెలకు అందించాలని మనమూ కోరుకుందాం.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more