అమెరికాలో గతేడాదిలో సంచలనం రేపిన చిన్నారి శాన్వీ హత్య కేసులో యంమూరి రఘునందన్ కు కోర్టు శిక్ష విధించింది. శాన్వీతో పాటు ఆమె నాన్నమ్మ సత్యవతిని హత్యచేసినట్లు యండమూరి రఘునందన్ పై ఆరోపణలు నిర్ధారణ కావటంతో దోషికి మరణ శిక్ష విధిస్తూ మాంటగొమెరీ జిల్లా కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.., గతేడాది అక్టోబర్ 22న అనుమానాస్పద స్థితిలో శాన్వి వెన్న ఆమె నాన్నమ్మ సత్యవతి వెన్న దారుణ హత్యకు గురయ్యారు. ముందుగా సత్యవతి మృతదేహంను గుర్తించిన పోలిసులు.. ఇంటిలో ఓ బెదిరింపు లేఖను కనుగొన్నారు. శాన్విని అప్పగించాలంటే 50వేల డాలర్లు ఇవ్వాలని లేఖలో ఉంది. దీంతో అమ్మాయి కిడ్నాప్ అయిందని నిర్ధారించారు.
ఈ ఘటనపై స్థానిక పోలిసులతో పాటు ఎఫ్.బీ.ఐ. కూడా రంగంలోకి దిగి ధర్యాప్తు చేసింది. వారం రోజుల పాటు వెతికినా చిన్నారి ఆచూకి లభించలేదు. శాన్వి కుటుంబం ఉంటున్న అపార్ట్ మెంట్ లో నివసించే తెలుగువాడైన యండమూరి రఘనందన్ వీరి కుటుంబానికి దగ్గరి స్నేహితుడు. పోలిసులకు ఇతనిపై అనుమానం వచ్చి విచారించగా.. ముందు బుకాయించాడు. ఆ తర్వాత తానే ఇద్దర్నీ హత్య చేసినట్లు అంగీకరించాడు. మళ్ళీ తర్వాత మాట మార్చాడు. తాను ఇంట్లో కేవలం డబ్బులు మాత్రమే దొంగతనం చేశానని చెప్పాడు. ఇద్దరు అమెరికా జాతీయులు తనను బెదిరించి వారిద్దరినీ హత్య చేశాడని ఆరోపించాడు.
ఈ ఘటనపై ధర్యాప్తు చేపట్టిన పోలిసులు 26 అక్టోబర్ 2013న ఓ సూట్ కేసులో శాన్వీ మృతదేహం గుర్తించారు. చనిపోయిన ఇద్దరినీ రఘునందన్ హత్య చేసినట్లుగా కోర్టుకు తెలిపారు. అయితే తనకు ఏ సంబంధ: లేదు అని కోర్టులో కూడా రఘునందన్ బుకాయించాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం శాన్వీ వెన్న, సత్యవతి వెన్నలను హత్య చేసింది రఘునందన్ అని ఈనెల 9న నిర్ధారించింది. కేసులో దోషిగా తేలిన రఘుకు మంగళవారం ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more