రాష్ర్టాలుగా విడిపోదాం.. అన్నదమ్ముల్లా కలిసుందాం అన్న మాటలు కేవలం ప్రకటనలు., పేపర్లపైనే తప్ప చేతల్లో కాదు అని మరోసారి నిరూపితం అయింది. ఏపీలో ప్రస్తుతం హుద్ హుద్ విరుచుకుపడుతుంది. ఈ సమయంలో తన మన బేధాలు మరిచి సాయం కోసం ఎదురుచూడాలి తప్ప కోపాలకు పోతే మునిగేది మనమే. ఈ విషయం చెప్తోంది చంద్రబాబు గురించి. హుద్ హుద్ తుఫాను వల్ల నష్టపోయిన రాష్ర్టాన్ని ఆదుకోవాలని ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిని కోరారు. సాయం కోసం పన్నీర్ సెల్వంకు ఫోన్ చేసినట్లు బాబు చెప్పారు.
విశాఖకు వెళ్తూ మార్గమద్యలో రాజమండ్రిలో మీడియాతో ఏపీ ముఖ్యమంత్రి మాట్లాడారు. విశాఖలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అక్కడే ఉంటానన్నారు. నష్టాన్ని శాటిలైట్ పరిజ్ఞానంతో అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా తుఫాను వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకుంటామన్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి తమకు హామి లభించిందన్నారు. అయితే ఈ సందర్బంగా తమిళనాడు ముఖ్యమంత్రిని సాయం కోరినట్లు చెప్పిన చంద్రబాబు.., తెలంగాణ ముఖ్యమంత్రిని సాయం కోరినట్లు గాని.., ఆయన ఏదైనా చేస్తానని చెప్పినట్లుగాని మీడియాకు వెల్లడించలేదు.
పక్కన ఉన్న తెలుగు రాష్ర్టం కంటే తమిళనాడుకే చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.., తెలంగాణ ముఖ్యమంత్రిని అడిగే కంటే తమిళసీఎం ను డబ్బులు పంపమనేందుకే చంద్రబాబు ఇష్టపడుతున్నారని విమర్శకులు అంటున్నారు. విపత్తుల సమయంలో బేషజాలకు పోవటం మంచిది కాదని చెప్తున్నారు. కాగా తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన కేసీఆర్.., ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా.., ఏపీని ఆదుకుంటామని చెప్పారు. ఈ మేరకు ఏపీ సీఎస్ కు సమాచారం ఇవ్వాలని తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు. సీఎం ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వానికి రాజీవ్ సమాచారం అందించారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more