భారత్, వెస్టీండీస్ మధ్య జరగాల్సిన మూడొ వన్డే మ్యాచ్ పై హుదూద్ తుపాను ప్రభావం పడింది. భారత పర్యటనలో టీమిండియాతో ఐదు వన్డే మ్యాచ్ లు ఆడాల్సిన వుంది. కాగా స్వదేశంలో జరగుతున్న సీరీస్ లో విండీస్ చేతిలో తొలి మ్యాచ్ ఒడిన పరాభవానికి టీమిండియా బదులు తీర్చుకుంది. ప్రస్తుతం రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిచి.. సీరిస్ లో సమంగా వున్నాయి. కాగా, మంగళవారం భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో వన్డేకు విశాఖ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో భారత్, వెస్టిండీస్ క్రికెట్ జట్లు ఇవాళ విశాఖ చేరుకోవాల్సి ఉంది. హుదుద్ తుపాను కారణంగా రెండు జట్లు ఇంకా విశాఖ చేరుకోలేదని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోకరాజు గంగరాజు తెలిపారు.
వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే సోమవారం రెండు జట్లు విశాఖ చేరుకుంటాయని, ప్రత్యేక విమానాల్లో ఆటగాళ్లను తీసుకొస్తామని ఆయన తెలిపారు. మైదానం తడవకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్ ను వీక్షించేందుక 70శాతం టిక్కెట్లు అభిమానులకు విక్రయించామని తెలిపారు. తుపాన్ నేపథ్యంలో మరో నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో మ్యాచ్ జరుగుతుందా..? అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి.
విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలపై హుదూద్ తుపాను ప్రభావం తీవ్రంగా వుండడంతో భారత్, వెస్టీండీస్ క్రీడాకారులను ఇక్కడ వచ్చేందుకు బీసీసీఐ అనుమతి ఇస్తుందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటికే 70 శాతం టిక్కెట్లు విక్రయించామని అధికారులు చెబుతున్నా.. భారీ వర్షాల నేపథ్యంలో వర్షంలో తడుస్తూ మ్యాచ్ చూసేందుకు అభిమానులు కూడా ఆసక్తి చూపరని పలువురు అంటున్నారు. మ్యాచ్ జరగకపోతే టిక్కెట్ల నగదును తిరిగి చెల్లిస్తామనిఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోకరాజు తెలిపారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more