ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారు రాజకీయాల్లో ఈజీగా రాణించవచ్చుని నానుడి. ఎందుకంటే వారి బంధువులు ఓట్లన్ని కలుపుకున్నా విజయం సాధిస్తారని ధీమా. లేనిపక్షంలో పెద్ద కుటుంబం వున్నా లాభమే. అప్పుడెప్పుడో మహాభారతంలో హస్తినాపురం పాలకులు ధృతరాష్ట్రుడికి వంద మంది సంతానం అని విన్నాం. అలాంటిదే వున్నా విందు, వినోదాలు, ఖర్చులు లేకుండా కనీసం ప్రచారమైనా చేసుకోవచ్చును కదా..! అయితే అది పురాణాలకే పరమితం అనుకుంటున్నారా..?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో తన ప్రత్యర్థులతో పోటీ పడుతున్న ఓ అభ్యర్థికి నాలుగు వేల మంది కూతుళ్లు, అల్లుళ్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. నిజమేనండీ.. షోలాపున్ దక్షిణ నియోజకవర్గం నుంచి బీజేపి తరపున బరిలోవున్న మాజీ ఎంపీ సుబాష్ దేశ్ ముఖ్ గెలుపు కోసం రెండు వేల మంది కూతుళ్లు, మరో రెండు వేల మంది అల్లుళ్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. నాలుగు వేల మంది కూతుళ్లు అల్లుళ్లు, ఇక వారి బంధుగణం అంతా కలిస్తే.. ఏ లెక్కన చూసినా సుబాష్ దేశ్ ముఖ్ విజయం ఖాయమని అర్థమవుతోంది. ఇక్కడ మీకో సందేహాం వచ్చింది.
బహుకాలం నుంచి రాజకీయాలలో వున్న సుబాష్ దేశ్ ముఖ్, ఏడేళ్ల క్రితం లోక్ మంగల్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వాటి ద్వారా అర్థికంగా, సామాజికంగా వెనకబడిన వారి అమ్మాయిలకు పెళ్లిళ్లు జరిపించేవారు. ప్రతీ ఏటా నవంబర్ నెలలో కార్తీక మాసంలో ఈ కళ్యాణ కార్యక్రమాలు నిర్వహించే వారు. వీరికి కొత్త వస్త్రాలు, సామాగ్రి, వీటితో పాటు పలు వంటసామాగ్రిని కూడా ఇచ్చేవారు. తమ పిల్లల కళ్యాణం చేయలేని పేద తల్లిదండ్రులకు ఆయన అండగా నిలచి, కళ్యాణాలు జరిపించేవారు. తాను కళ్యాణం జరిపించిన జంటలకు ఆడ పిల్ల జన్మిస్తే ఐదు వేల రూపాయల పారితోషకాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయిస్తారు. అమ్మాయికి 18 ఏళ్ల వయస్సు వచ్చిన తరువాత అవి వారి పెళ్లిళ్ల కోసం చేతికందేలా ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడు.
కాగా గత ఏడేళ్లో ఇప్పటికి వరకు రెండు వేల మంది జంటలకు ఆయన తన చేతుల మీదుగా పెళ్లిళ్లు చేశారు. ఎంతో మంది పేద రైతులు అమ్మాయిల పెళ్లి కోసం తమ భూమిని తక్కువ ధరకే అమ్మి రోడ్డుపాలవుతున్నారని, మరికొందరు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని తాను పెళ్లిళ్ల ఖర్చులతో పాటు సామాగ్రి, వంట సామాగ్రి ఇత్యాదులను సమకూరుస్తున్నానని సుభాష్ దేశ్ ముఖ్ చేప్పారు. ప్రస్తుతం తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దిలిప్ మానెతో గట్టి పోటీని ఎదుర్కొంటున్న ఈయన..తన కూతుళ్లు, అల్లుళ్ల ప్రచారంతో తప్పక గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more