పదేళ్ల యూపీఏ అధికార దర్పం నుంచి ఇంకా ఆ పార్టీ నేతలే భయటకు రాలేదు. మరి అలాంటిది ఆ పార్టీ యువరాజును అప్పుడే అధికార దర్పం ఎలా వదులుతుంది. ఎవరి గురించి చెబుతున్నామో.. మీకు అర్థమైంది కదూ.. అవునండీ.. కాంగ్రెస్ యువరాజు, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ గురించే.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రజాతీర్పుతో ధిమ్మతిరిగిపోయిన కాంగ్రెస్ కు.. అధికారంలో వున్నామన్న భ్రమ మాత్రం తొలగడం లేదు. నమ్మలేమంటారా..
ఈ ఏడాది మే నెలలో వచ్చిన దేశప్రజల తీర్పుతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారానికి దూరమైంది. ఇది జరిగి నాలుగు నెలలు కావస్తున్నా.. నరేంద్రమోడీని ఉద్దేశించి ప్రతిపక్ష నేత అని సంబోధించారు యువరాజు రాహుల్ గాంధీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న రాహుల్ గాంధీ.. మహాద్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీని ఉద్దేశించి ఆయన ప్రసంగిసతూ.. ప్రతిపక్షంలో కూర్చున్న నేతలు గత 60 ఏళ్ల నుంచి ఏ మాత్రం అభివృద్ది జరగలేదని విమర్శిస్తున్నారు. వారి ఆలోచన ప్రకారం కేవలం ఒక్క మనిషే భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లగలరు అని వ్యాఖ్యానించారు. అరవై ఏళ్లుగా భారతదేశంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని వారి విమర్శలు అంబేద్కర్, మహాత్మాగాంధీ, సర్థార్ పటేల్, నెహ్రూల చిత్తశుద్దిని ప్రశ్నించేలా వుందని దుయ్యబట్టారు. జమ్మూకాశ్మీర్ సరిహద్దులో భారత పాక్ ఆర్మీ బలగాల మధ్య భీకర పోరు నడుస్తున్నా.. ప్రధాని మౌనంగా ఎందుకున్నారో చెప్పాలని రాహుల్ నిలదీశారు.
ఇంత దారుణ ఓటమికి గురై ప్రతిపక్ష హోదా కోసం దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం వచ్చినా.. రాహుల్ గాంధీకి ఇంకా వాస్తవాలు తెలియడం లేదెందకని బీజేపి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఆయన మిల్క్ బాయ్ అని తమ నాయకుడు, ప్రధాని మోడీ ఎందుకన్నారో ఇవాళ దేశం అంతా తెలిసిందని అన్నారు. అక్టోబర్ 15న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలకు కొదవే లేకుండా పోతోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more