తెలంగాణ ప్రజల సంక్షేమానికి రాష్ర్ట ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ వారికే ఫలాలు దక్కాలనే లక్ష్యంతో పకడ్బందీ కార్యక్రమాలు చేపడుతోంది కూడా. తమ ఫలాలు రాష్ర్టంలోని తెలంగాణ ప్రజలకే కాకుండా.., విదేశాల్లో ఉన్న తెలంగాణవారికి కూడా అందించాలనుకుంటోంది. అందుకోసమే ప్రవాస తెలంగాణేయుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజల సంక్షేమం ప్రధాన లక్ష్యంగా ఈ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
ఇప్పటికే కేరళ, పంజాబ్ రాష్ర్టాలు విదేశాల్లో ఉన్న తమవారి కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసుకున్నాయి. వాటి ద్వారా పరాయిగడ్డపై ఉన్న తమవారి సంక్షేమం కోసం నిధులను కేటాయించటంతో పాటు వారి కోసం సహాయక కార్యక్రమాలను కూడ నిర్వహిస్తున్నాయి. అదే తరహాలో తెలంగాణ కూడా ప్రవాసీతెలంగాణ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రెండు రాష్ర్టాల్లాగానే సంక్షేమ నిధి ఏర్పాటు, సహాయక కార్యక్రమాలు ప్రధాన ఎజెండాలుగా ఇది ఏర్పడనుంది. ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రతిపాదనపై చర్చ జరిపి మంత్రిత్వ శాఖకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది.
మంత్రిత్వ శాఖ వల్ల కలిగే ప్రయోజనాలు :
* ఒక సంక్షేమ నిధి నిర్వహణ. ప్రభుత్వ నిధుల కేటాయింపు.
* ప్రవాసీయుల సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు హెల్ప్ లైన్ ఫోన్ నంబర్తో 24గంటల సహాయ కేంద్రం ఏర్పాటు.
* రాష్ర్టంలోని అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలతో హెల్ప్ లైన్ అనుసంధానం చేసి పర్యవేక్షణకు ఒక ఎస్పీ నియామకం.
* విదేశాలలో మోసపోయి వచ్చే వారికి రాష్ట్రంలో పునరావాసం, ఉపాధికి ప్రత్యేక పథకం.
* వివాహం తర్వాత జరిగే మోసాలను అరికట్టేందుకు ప్రవాసీయుల వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలనే నిబంధన.
* ఇమ్మిగ్రేషన్ విభాగం ద్వారా విదేశాలకు వెళ్లే వారి వివరాలు జిల్లా స్థాయిలో సేకరించడం.
* విదేశాల్లో ఉన్న తెలంగాణ వారి భద్రత, సహాయం కోసం రాయబార కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు.
* ఎన్ఆర్టీల కోసం ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు. మెయిళ్ల ద్వారా దరఖాస్తులను, ఫిర్యాదులను స్వీకరణ.
* ప్రవాసీయులు రాష్ర్టంలో పెట్టుబడులు జరిపేలా ప్రోత్సాహం. ప్రత్యేక రాయితీలు, సబ్సిడీల కల్పన
తెలంగాణకు చెందిన దాదాపు 8లక్షల మంది ప్రజలు విదేశాల్లో ఉంటున్నారు. ప్రధానంగా అమెరికా, బ్రిటన్, ఆస్ర్టేలియా, గల్ఫ్, ఆఫ్రికా, న్యూజిలాండ్ దేశాల్లో తెలంగాణ వారు ఎక్కువగా ఉన్నారు. విదేశాల్లో అనేకమంది నానా ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు సరిగా ఇవ్వక.., ఉపాధి అవకాశాలు లేకపోవటంతో పాటు ఏజంట్లు ఉద్యోగ ఉందని చెప్పి మోసం చేసి విదేశాలకు పంపిస్తే.., అక్కడ అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకునేందుకు మంత్రిత్వ శాఖ కృషి చేస్తుంది. ప్రస్తుతం ప్రవాస తెలంగాణ వారికి ఒక విభాగం పనిచేస్తుండగా ఇకపై ప్రత్యేక మంత్రిత్వ శాఖ వీరి బాగోగులను చూసుకోనుంది. సాధారణ పరిపాలన శాఖకు చెందిన అధికారులు ఇప్పటికే ఈ శాఖ ఏర్పాటు, పనితీరుపై కేరళ, పంజాబ్ ప్రభుత్వాలో సంప్రదింపులు జరిపి సమాచారం సేకరించారు. అదే విధంగా ఒక ప్రత్యేక కమిటిని గల్ఫ్ కు పంపి.., అక్కడి ప్రభుత్వ నిబంధనలపై అధ్యయనం చేయిస్తొంది. ప్రత్యేక శాఖ ఏర్పడితే పొట్ట చేతబట్టుకుని విదేశాలకు వెళ్లి మోసపోయే వారికి మంచిరోజులు వచ్చినట్లే అని ప్రవాసి తెలంగాణేయులు అంటున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more