గ్రామ సర్పంచ్ అంటేనే ఐదేళ్ల పదవీకాలంలో లక్షాధికారి నుంచి తలుచుకుంటే కోటిశ్వరుడు అవుతాడు. ఈ విషయం అందరికి తెలిసిందే. కాని కేంద్ర మంత్రి అయినా ఆస్తి మాత్రం కనీసం నలబై లక్షలు కూడా లేదు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆస్తి విలువ రూ. 40లక్షలకు తక్కువే. ఈ లెక్కలు స్వయంగా ప్రధాని కార్యాలయం చెప్తోంది. కేంద్రమంత్రుల ఆస్తుల వివరాలను సోమవారం రోజు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం.., అత్యంత ధనవంతుడైన కేంద్రమంత్రిగా అరుణ్ జైట్లి ప్రధమ స్థానంలో ఉన్నారు. జైట్లీ ఆస్తి విలువ రూ.72.10కోట్లుగా ఉంది.
ఇక ప్రధాని నరేంద్ర మోడీకి రూ.1.26 కోట్ల ఆస్తులున్నాయి. మోడీకి రూ.38,700 నగదు, రెండు బ్యాంకు ఖాతాల్లో రూ.1,32,698, రూ.17,00,927ల చొప్పున నగదు నిల్వలు, రూ.2,35,000, రూ.20,000 విలువైన రెండ్లు, గాంధీనగర్ లో రూ.1 కోటి విలువ చేసే ఇల్లు ఉంది. వీటితో పాటు రూ.1,20,980 విలువ కలిగిన నగలు, ఖరీదైన వస్తువులు, రూ.1,99,031 విలువ కలిగిన ఇన్సూరెన్స్ బాండ్, ఉన్నాయి. అయితే ఈ ఈ జాబితాలో మోడి భార్య జశోదా బెన్ ఆస్తుల వివరాల కాలమ్ ఎదురుగా ‘నాట్ నోన్’ అన్న పదాలు రాసిపెట్టారు. ఇక వెంకయ్యనాయడు కంటే కాస్త ఎక్కువగా కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వన్ ఉన్నారు. ఈయన ఆస్తి విలువ రూ. 39.88 లక్షలుగా ఉంది.
ఏపీకి చెందిన కేంద్రమంత్రి, టీడీపీ నేత అశోక గజపతి రాజు ఆస్తి విలువ రూ.3.32కోట్లుగా ఉన్నట్లు పీఎంఓ వెల్లడించింది. కేబినెట్ లో నెంబర్ టూ స్థానంలో ఉన్న రాజ్ నాధ్ సింగ్ కు రూ.2.56కోట్ల ఆస్తి ఉంది. విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ కు రూ.2.73కోట్ల ఆస్తి ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. వీరితో పాటు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ఆస్తి విలువ రూ. 48.54లక్షలే. ఇలా మొత్తం 22మంది కేంద్రమంత్రుల్లో 17మంది కోటిశ్వరులు ఉన్నారు. మిగతావారు లక్షాధికారులు ఉన్నట్లు ప్రధాని కార్యాలయ వెబ్ సైట్ జాబితాను ప్రకటించింది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more