తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు టీఆర్ఎస్ నేత, ఎంపీ కడియం శ్రీహరి చుక్కలు చూపించారు. వరంగల్ జెడ్పి సమావేశంలో ఇద్దరు నేతలు ఢీ: అంటే ఢీ: అనేలా మాటలు అనుకున్నారు. మొదట్లో కడియంను ఇరుకున పెట్టేందుకు ఎర్రబెల్లి అదరగొట్టినట్లు మాట్లాడారు. కాని చివర్లో ఎంపి అన్న మాటకు నోరు కదపలేకపోయారు. ఇక్కడ రాజకీయాలు వద్దు అని తప్పించుకునే ప్రయత్నం చేశారు తప్ప ఆరోపణను తోసిపుచ్చే ధైర్యం చేయలేకపోయారు. ఈ కామెంట్ పై ప్రస్తుతం తెలంగాణలోని రాజకీయ నేతల మద్య తీవ్ర చర్చ జరుగుతోంది.
ఫోన్ చేయలేదా.. చెప్పు..?
సోమవారం జరిగిన వరంగల్ జెడ్పీ సమావేశం రసాబాసగా మారింది. ఎరువులు అక్రమంగా బయట విక్రయిస్తున్నారని టీడీపీ ఈ అంశాన్ని లేవనెత్తింది. అదేవిధంగా రైతుల ఇబ్బందులు, ఎరువులు లేక పంటలు నష్టపోతున్న అంశాలపై టీడీపీ నేతలు విమర్శలు చేశారు. దీనికి ఎంపి కడియం శ్రీహరి సమాధానం ఇస్తుండగా., ఎంపీ ఏమి చెప్పనవసరం లేదు అంటూ ఎర్రబెల్లి మాట్లాడారు. దీంతో కడియంకు కోపం వచ్చింది. మీరేంటి నాకు చెప్పేది. ఎవరేమిటో అందరికి తెలుసు.., ‘టీఆర్ఎస్ లో చేరుతాను’ అని నాకు ఫోన్ చేయలేదా చెప్పు అని దయాకర్ రావును కడియం ప్రశ్నించారు.
ఈ మాటలతో ఎర్రబెల్లి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అయితే వెంటనే తేరుకుని ఇది రాజకీయాలకు వేదిక కాదు. ప్రజా సమస్యలకు పరిష్కారం కావాలి అని అన్నారు. అయితే గులాబిదళంలో చేరికపై కడియం శ్రీహరి చేసిన ఆరోపణను మాత్రం ఎర్రబెల్లి తోసిపుచ్చలేదు. దీంతో తాను టీఆర్ఎస్ లో చేరటం లేదని.. కేసీఆర్ ను కలిసింది అవాస్తవం అని గతంలో ఆయన చెప్పిన మాటలు అవాస్తవం అని స్పష్టం అవుతోంది. కేసీఆర్ ను కలవటం మాట అటుంచితే.., గులాబి దళంలో చేరేందుకు మాత్రం దయాకర్ రావు తీవ్రంగ ప్రయత్నించినట్లు స్పష్టం అవుతోంది. మరి దీనిపై పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more