టీడీపీ నేత రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ పై విమర్శలు ఎక్కు పెట్టారు. ఈ సారి మెట్రో అంశంగా... అస్ర్తంగా ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ నేతల దురాశ వల్లే మెట్రో పనులు ఆగిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రాజెక్టుపై కనీస అవగాహన లేని ప్రభుత్వం.., ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటం వల్లే ఇలా జరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి స్పష్టత, అవగాహన లేదన్నారు. రైలు అలైన్ మెంట్ మార్చాలని సీఎం మొండిపట్టుతో ఉన్నారని.. ఇది ఖర్చుతో కూడుకున్న పనితో పాటు.., ప్రమాదకరమైనదిగా అధికారులే చెప్తున్నా విన్పించుకోవటం లేదని ద్వజమెత్తారు. దీని వల్ల పనులు ఆలస్యం అయి, ఫలితంగా ప్రభుత్వమే అదనపు ఖర్చును భరించాల్సి వస్తోందని విమర్శించారు.
ఇక మెట్రోకు తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు కల్గిస్తోందన్నారు. చివరకు గచ్చిబౌలిలో కేటాయించిన స్థలాన్ని కూడా తీసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి దురాశపర చర్యల వల్లే విసుగుచెందిన ఎల్&టి రైలు పనులు చేపట్టలేమని ప్రకటించారని మండిపడ్డారు. తెలంగాణ మణిహారంగా., అభివృద్ధిలో కీలకం అయిన మెట్రో రైలుపైనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తే.., రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వం ఏ మేర చిత్తశుద్ధి చూపిస్తుందో తెలుస్తోందన్నారు. ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ విమర్శలు చేశారు.
మెట్రో రైలు పనులు తాము చేపట్టలేమని ఎల్&టీ సంస్థ హైదరాబాద్ మెట్రో రైలుకు లేఖ రాసింది. పెరిగిన వ్యయం, రాష్ట్ర విభజనతో హైదరాబాద్ లో పరిస్థితులు ఇతర కారణాల వల్ల తాము ప్రాజెక్టును చేపట్టలేమని లేఖ రాసింది. దీంతో దేశంలోనే ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న తొలి రవాణా వ్యవస్థ పనులకు ఆటంకం ఏర్పడినట్లయింది. సంస్థ రాసిన లేఖలో తమకు ఎదురవుతున్న ఇబ్బందులన్నీ వివరించింది. ఒప్పందం జరిగిన సమయంలో ప్రభుత్వం తమకు సహకరిస్తామని మాట ఇచ్చిందనీ.., ఇప్పుడు వచ్చిన తెలంగాణ ప్రభుత్వం తమకు ఇబ్బందులు కల్గిస్తోందని ఎల్&టీ ఆరోపించింది. భూముల కేటాయింపులో ఆలస్యం చేయటంతో పాటు అలైన్ మెంట్ మార్చాలని పట్టుబట్టడం తీవ్ర ఇబ్బందికరంగా చెప్పింది. రూటు లైను మార్చితే.., తమకు అధిక వ్యయం కావటంతో పాటు., భూగర్భ జలాలు తగ్గిపోవటం.., రైలు మార్గంలోని నిర్మాణాలకు ముప్పు ఏర్పడుతుందని అధ్యయనంలో తేలిందన్నారు. అయినా సరే ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోటం బాధాకరమని సంస్థ ప్రతినిధులు అంటున్నారు.
విభజన ప్రభావం పడింది
ఇక రాష్ర్ట విభజన ప్రభావం రైల్వే నిర్మాణంపై స్పష్టంగా పడిందన్నారు. ఒప్పందం జరిగిన సమయంలో హైదరాబాద్ 23 జిల్లాలకు రాజధాని కాగా.., ఇప్పుడు కేవలం 10 జిల్లాలు గల చిన్న రాష్ర్టానికి రాజధాని అని ఫలితంగా ఇక్కడకు వివిధ పనుల కోసం వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందన్నారు. అటు నగరంలోని కంపనీలు, ఫ్యాక్టరీలు ఆంద్రప్రదేశ్ కు తరలిపోవటంతో పాటు అక్కడ కూడా కొత్త రాజధాని నిర్మాణం జరుగుతుండటంతో ప్రజలు ఎక్కువగా హైదరాబాద్ కు వచ్చే అవసరం ఉండదని చెప్పారు. దీనికి తోడు విభజన జరిగినా హైదరాబాద్ పరిస్థితులను బట్టి నగరం ఉమ్మడి రాజధానిగా లేక కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందని భావించి ప్రాజెక్టు చేపట్టేందుకు ముందుకు వచ్చామని లేఖలో వివరించారు. అయితే కేవలం తెలంగాణకు రాజధాని కావటం వల్ల మౌళిక సదుపాయాలు, పెట్టుబడులు పెట్టే కంపనీల సంఖ్య తగ్గుతుందన్నారు.
కేవలం టికెట్ చార్జీల ఆధారంగా రైళ్లను నడపలేమని వివరించారు. అందువల్లే తాము ప్రాజెక్టు నిర్మాణం నుంచి తప్పుకోవాలనుకుంటున్నామని ఎన్వీఎస్ రెడ్డికి లేఖ ఎల్&టీ మెట్రో రైలు విభాగం తరపున వివేక్ గాడ్గిల్ లేఖ రాశారు. ఇప్పటి వరకు చేసిన పనులకు, చట్ట పరంగా తమకు రావాల్సిన డబ్బులు ఇస్తే నిర్మొహమాటంగా పనుల నుంచి తప్పుకుంటామని ఆయన ప్రకటించారు. దీనిపై చర్చించేందుకు త్వరలోనే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఒక తేదిని, వేదికను ఖరారు చేసి చెప్పాలని కోరారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more