ఇళ్ళు కాలి ఒకడు ఏడుస్తుంటే... ఇంకేదో కావాలన్నట్లుంది జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యవహారం. భారీ వరదలతో రాష్ర్టం అతలాకుతలం అవుతుంటే ముఖ్యమంత్రి మాత్రం తన సెల్లో చార్జింగ్ లేదని.. చార్జర్ పట్టుకుని తిరుగుతున్నారు. ఓ జాతీయ మీడియాలో జరిగిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తన సెల్ ఫోన్ చార్జింగ్ అయిపోయిందనీ.., నెట్ వర్క్ కూడా లేదని వాపోయాడు. ఎవ్వరితో మాట్లాడే అవకాశమే లేకుండా పోయిందని తెలిపారు. ప్రజలకు అందిస్తున్న సహాయంపై సమాధానం చెప్పమంటే ఇలా మాట్లాడటంతో స్టూడియోలోని సీనియర్ జర్నలిస్టులతో పాటు.., వీక్షకులు కూడా ఆశ్చర్యపోయారు.
ప్రభుత్వమే మునిగిపోయింది
వరదల్లో చిక్కుకున్న ప్రజలకు అందిస్తున్న సాయం వివరాలు, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ఓ వార్తాచానెల్ అబ్దుల్లాను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్బంగా ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్నకు.. ప్రభుత్వం ఎక్కడుందని ఎదురు ప్రశ్నించారు. సచివాలయం, పోలిసు విభాగాలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్ని నీట ముగినిపోతే ఇక తన ప్రభుత్వం ఎక్కడుంది.. ఎక్కడి నుంచి పరిపాలన చేస్తుందన్నారు. అదే విధంగా తాను ఒక చిన్న గదిలో కేవలం ఆరుగురు వ్యక్తులతో పనిచేస్తున్నా అని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమూ.. పనితీరు ఎలా ఉంటుందన్నారు. పూర్తిగా ఆర్మీ సేవలు అందిస్తోందని వారిని కొనియాడారు.
సెల్ చార్జింగ్ లేదు
ఇక మంత్రులను, అధికారులను అప్రమత్తం చేయటంపై కూడా వింతగా సమాధానం ఇచ్చారు. వారిని అప్రమత్తం చేయటానికి సమాచార వ్యవస్థే లేదు కదా అని సింపుల్ గా చెప్పారు. కరెంటు లేక తన సెల్ లో కూడా చార్జింగ్ లేదనీ.., అంతేకాకుండా నెట్ వర్క్ కూడా దెబ్బతినటంతో సిగ్నల్ కూడా లేదని...ఇక ఎవరికి ఫోన్ చేయాలి అని సర్ధి చెప్పుకున్నారు. మంత్రులు, అధికారుల్లో కొంతమంది ఆచూకి తెలియదన్నారు. ఇప్పుడిప్పుడే కొందరు తనను కలుస్తున్నారని తెలిపారు. విపత్తు వచ్చినపుడు సాయం చేసే స్థితిలో లేకపోయినా కనీసం నైతిక స్థైర్యం ఇవ్వకుండా ఇలా వివాదాస్పదంగా ముఖ్యమంత్రి మాట్లాడటంపై జమ్మూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more