జమ్మూలో వరద భీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలు హిమాలయ రాష్ర్టాన్ని ముంచెత్తుతున్నాయి. దీంతో వరదలు వచ్చి వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. అటు వరదలతో ఇప్పటివరకు 150కి పైగా ప్రజలు మృతి చెందారు. ప్రకృతి ప్రకోపానికి వేల సంఖ్యలో ఇళ్ళు నేలమట్టం అయ్యాయి. భవంతులు సైతం నీట మునిగాయి.., వంతెనలు కొట్టుకుపోయాయి. చల్లగా ప్రశాంతంగా ఉండే కాశ్మీరం వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రాష్ర్టాన్ని ఇప్పట్లో కోలుకోలేని విధంగా వరుణుడు నాశనం చేశాడు.
జాతీయ విపత్తుగా ప్రకటన
వరద భీభత్సంపై స్పందించిన ప్రధాని నరేంద్రమోడి ఆదివారం కాశ్మీర్ లో పర్యటించారు. వర్షం నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. రాష్ర్టానికి తక్షణ సాయం కింద రూ.1000 కోట్లు ప్రకటించారు. అంతేకాకుండ జమ్మూ వరదలను జాతీయ విపత్తుగా పరిగణించారు. యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కేంద్రం ఎఫ్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు ఆర్మీ, వైమానిక దళాలు రంగంలోకి దిగాయి. ముంపు ప్రాంతాల ప్రజలను ఆర్మీ, వైమానిక యుద్ద హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వరదలతో రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినటంతో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సమాచార చేరవేత నిలిచిపోయింది. అనేక ప్రాంతాలు ఇంకా జలదిగ్భందంలో ఉన్నాయి. శ్రీనగర్ సచివాలయం, హైకోర్టు కూడా ఏకంగా ఎనమిది అడుగుల లోతు నీటిలో మునిగిపోయి ఉన్నాయంటే వరదల నష్టం ఏ మేరకు ఉందో అర్ధం చేసుకోవచ్చు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లతున్నాయి. దీంతో సహాయక చర్యలు చేపట్టేందుకు వరదలు తీవ్ర ఆటంకం కల్గిస్తున్నాయి. ఆక్రమిత కాశ్మీర్ లో కూడా వరదలు భీభత్సం సృష్టించాయి. అక్కడ కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు భారత్-పాక్ సంసిద్ధత వ్యక్తం చేశాయి. గత రెండు దశాబ్దాల కాలంలో రాష్ర్టంలో ఇవే భీకర వరదలుగా అక్కడి ప్రభుత్వం తెలిపింది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more