ఇది ఓ భాదితురాలి నోటి నుంచి ఆవేదనతో, ఆక్రోశంతో వచ్చిన మాట. తనకు జరిగిన అన్యాయన్ని మైనర్ బాలిక కళ్ళకు కట్టినట్లు వివరించింది. అది విన్న ప్రతి ఒక్కరూ మృగాళ్లపై కోపంతో రగిలిపోతున్నారు. ఇది విదేశాల్లోనో లేక మనదేశంలోని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లోనో అంతకన్నా కాదు.., హైదరాబాద్ నడొబొడ్డున.., పాతబస్తిలో ఓ ముస్లిం మైనర్ బాలిక ఖామాందుల చేతిలో బలయింది. ఆగస్టు 31 న ఆమెపై మొదలైన అత్యాచారాఖాండ, మూడ్రోజుల పాటు కొనసాగింది. ఒకరి నుంచి తప్పించుకుంటే మరొకరు.., ఇలా వెళ్లిన ప్రతి చోటా కామాందులే కన్పిస్తుండటంతో.., ఏమి చేయలేక వారి చేతిలో నలిగిపోయింది.
పూర్తి వివరాలు చూస్తే.., కందికల్ గేట్ సమీపంలో ఉండే ఓ మైనర్ బాలిక (14) తన ఫ్రెండ్ తో కలిసి ఆగస్టు 31న ఓ ఫంక్షన్ కు వెళ్ళింది. అక్కడ సమీపంలో ఓ డైరీ ఫాంలో పనిచేసే పరిచయస్తుడైన అబ్బాయి (అతడు కూడా మైనరే) బలవంతంగా ఫాం లోకి తీసుకెళ్లాడు. వెంట వచ్చిన ఫ్రెండ్ ను బయటే ఉండమని చెప్పి.., బాధితురాలిని తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఎవరికి విషయం చెప్పవద్దని బెదిరించి పంపాడు. అక్కడి నుంచి బయటపడ్డ అమ్మాయి మరో ప్రాంతం నుంచి ఇంటికి వెళ్ళేందుకు చంద్రాయణ గుట్ట చేరుకుంది. అక్కడ సయీద్ అనే మరో కామాంధుడు వీరిని ఆటోలో ఎక్కించుకుని బార్కాస్ లోని స్మశానవాటికకకు తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. సయీద్ కూడా ఎవరికి చెప్పవద్దని తీవ్రంగా బెదిరించాడు.
సయీద్ బెదిరింపులతో వణికిపోయిన ఆ అమ్మాయి ప్రెండ్ తో కలిసి ఇంటికి బయల్దేరింది. ఇదే సమయంలో ఫ్రెండ్ సోదరుడు వచ్చి ఆమెను తీసుకెళ్లాడు. ఇద్దరి అఘాయిత్యాలు.., చీకటి కావటంతో ఒంటరితనం.., ఇంటికి వెళ్తే ఏమంటారో అనే భయంతో రాత్రి ఆ అమ్మాయి ఇంటికి వెళ్లలేదు. ఇదే సమయంలో అటుగా వచ్చిన హబీబ్ అనే ఆటో డ్రైవర్ బాలికను ఆటోలో ఎక్కించుకుని తెలిసిన మహిళ దగ్గర ఉంచాడు. తర్వాతి రోజు తీసుకెళ్లి ఉస్మానియా హాస్పిటల్ సమీపంలో నిర్జన ప్రదేశంలో రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరిగి 2వ తేది తెల్లవారుజామున ఫలక్ నమా రైల్వేస్టేషన్ లో వదిలి వెళ్ళాడు.ముగ్గురు మృగాళ్ల దాడికి బలయిన మైనర్ బాలిక సాయంత్రం ఎట్టకేలకు ఇంటికి చేరింది.
అప్పటికే కూతురు అదృశ్యంపై చంద్రాయణగుట్ట పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తల్లితండ్రులు, రెండ్రోజులు ఎక్కడకు వెళ్లావంటూ ప్రశ్నించటంతో విషయం చెప్పేసింది. తనపై ముగ్గురు దుర్మార్గులు చేసిన అఘాయిత్యాలను కన్నవారికి వివరించింది. కూతురుకు జరిగిన అన్యాయం తెలిసిన తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. 14ఏళ్ళు కూడా నిండని తమ కూతురును ఇలా చేశారంటూ కుమిలిపోయారు.ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారిని వదిలి పెట్టవద్దని నిశ్చయించుకుని, కూతురుతో కలిసి పోలిస్ స్టేషన్ కు వెళ్ళారు. జరిగిన అన్యాయం, అఘాయిత్యాన్ని వివరించారు. ఒక్కసారిగా నివ్వెరపోయిన పోలిసులు.., కంప్లయింట్ తీసుకుని వెంటనేరంగంలోకి దిగారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై నిర్భయ చట్టం కింద కేసు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే నిందితుల అరెస్టు వార్తను పోలిసులు బయటకు తెలియనివ్వలేదు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more