(Image source from: telangana minister harish rao controversial comments on chandrababu kishan reddy pawan kalyan)
ప్రస్తుతం ఆంధ్రా, తెలంగాన రాజకీయ పరిణామాలు వాడీవేడీగా నడుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్ ఉపఎన్నికల నేపథ్యంలో టీడీపీ-బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరిపోతున్నాయి. అయితే వీరిలో టీఆర్ఎస్, టీడీపీ పార్టీ నాయకులు మాటలతూటాలతో ఒక్కొక్కొరికి పొడుచుకుంటున్నారు. ఈ యుద్ధం ఎంతవరకు సాగుతోందంటే.. ఏకంగా చెప్పులతో కొట్టుకునే మాటలదాకా వెళ్లిపోయింది. అందులోభాగంగానే తెలంగాన టీడీపీ నేతలు టీఆర్ఎస్ పార్టీ అధినేత - సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమను సమైక్యవాది అని మరోసారి చెబితే.. చెప్పులతో కొడతామని టీ.టీడీపీ మంత్రులు హెచ్చరించారు. అలాగే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీపై తనవంతు విమర్శలు చేశారు. అందుకు ధీటుగానే టీఆర్ఎస్ పార్టీ మంత్రులు కూడా తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలోనే మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో విమర్శనాస్త్రాలను సంధించారు. తమ మీద విమర్శలు చేసిన అందరూ నాయకులమీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో కిషన్ రెడ్డి కీలుబొమ్మగా మారాడని ఆయన పేర్కొన్నారు. ఇంతకు తెలంగాన బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డా..? లేక చంద్రబాబు నాయుడా..? అంటూ ఆయన ప్రశ్నించారు. ఇంకా రాజకీయ అనుభవం లేని పవన్ కల్యాణ్ లాంటివారి డైరెక్షన్ లో బీజేపీ అధ్యక్షుడైన కిషన్ రెడ్డి నడుచుకోవడం చాలా హాస్యాస్పదంగా వుందని ఆయన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్నే ఆయన ‘‘పవన్, చంద్రబాబు డైరెక్షన్ లో ‘‘రెడ్డి’’ కీలుబొమ్మ’’ అంటూ ఆయన అభివర్ణించారు.
గతంలో సమైక్యవాదినంటూ చెప్పుకున్న జగ్గారెడ్డికి మద్దతు తెలుపుతున్న టీడీపీ పార్టీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే టీ.తెలుగుదేశం నేతలు ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డిల మీద కూడా హరీష్ రావు ధ్వజమెత్తారు. వారికి ఏమాత్రం రోషం వున్నాగానీ చంద్రబాబుకు పల్లకి మోయడం ఆపాలని అన్నారు. ఇక మెదక్ ఎలక్షన్ల గురించి మాట్లాడుతూ.. మెదక్ స్థానం తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని ప్రణాళికలు రచించినా.. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తారని ఆయన నమ్మకాన్ని వెలిబుచ్చారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికోసం ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని.. అవి త్వరలోనే ఆచరణలోకి రానున్నాయని స్పష్టం చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more