ఉమ్మడి రాష్ట్రం, రాష్ట్రం విడిపోయిన.. అన్నదమ్ముల్లా ఉందాం!! అని పలిక గొంతులు, ఇప్పుడు కాకి కూతులు కూస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అరాచకాలు, వివాదాలు, రేపుతూ.. ప్రజల మనసు పాడు చేస్తున్నాయి. అధికార స్థాయి మరిచిపోయి, వెకిలి చేష్టాలు చేస్తూ.. తెలుగు వారి పరువును తీస్తున్నారు.
రాష్ట్రం సాధించుకున్నది పగ కోసమా? లేక అభివృద్ది కోసమా ! అంతగా పగ అనేది ఉంటే.. ఒక్కసారి యుద్ద భూమిలో కలబడితే సరిపోతుంది కదా! ప్రతి రోజు , ప్రతి అధికారిపై, ప్రతి నేతపై ఈ గిల్లి గజ్జాలు ఎందుకు? కొత్త సమస్యను సృష్టించి ఏం సాధించాలో ఒక్కసారి చెప్పండి?
కొత్త పిచ్చికి కాలం తెలియదని విధంగా వ్యవహరిస్తే.. భవిష్యత్తులో.. ఘోరంగా నష్టపోవాల్సి వస్తుందని మేథావులు అంటున్నారు. ఇలాంటి పనుల వల్ల ఎవరికి ఎలాంటి లాభం ఉండదు కానీ, ప్రజల మనసు గాయపడుతుందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఒక ఐఏఎస్ అధికారిని పై ఒక కానిస్టేబుల్ పెత్తనం చేయటం అందరు ఆశ్చర్యపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తోన్న ఐఏఎస్ అధికారి శామ్ బాబు ను తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ కానిస్టేబుల్ అడ్డుకోవడం వివాదస్పదమవుతోంది. నేషనల్ అకాడెమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (నాక్)కు డైరక్టర్ గా శాంబాబును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే నియమించింది.
తన విధుల్లో భాగంగా నాక్ లోపలకి ప్రవేశించబోతున్న ఆయనను తెలంగాణ రాష్ట్రానికి చెందిన కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. లా అండ్ ఆర్డర్ సమస్యను కారణంగా చూపి... ఆ కానిస్టేబుల్ శాంబాబును నాక్ లోపలకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. ఈ విషయాన్ని, శాంబాబు గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకువెళ్లారు. తన విధులకు ఆటంకం కలిగించిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంపై ఐఏఎస్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామన్ క్యాపిటల్ గా ఉన్న హైదరాబాద్ లో ఆంధ్రా అధికారులకు జరుగుతోన్న అవమానాలపై గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలని వారు ఆయనను డిమాండ్ చేస్తున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more