మియ్యాం.. మియ్యాం .. మిల్క్ షేక్ పిల్లి అంటూ.. ఒక సినీ కవి పాట రాసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ పాట అందరి చేత మియ్యాం .. మియ్యాం పాలు తాగించింది. కానీ ఇప్పుడు మియ్యాం లాంటి పిల్లి ,. అది పాలు ఇవ్వదు ! అయినా దాని కాఫీ తాగితే.. గుండెజారిపోవటం ఖాయమని చెబుతున్నారు.
పిల్లి లాంటి పిల్లి.. ! పునుగు పిల్లి . గురించి అందరికి తెలుసు. కానీ దానిలో విశేష గుణాలు గురించి పెద్దగా తెలియదు. పునుగు పిల్లి అంటే ఆ భగవతుడికి చాలా ఇష్టం. పునుగు పిల్లి చర్మంనుండి వెలువడే తైలాన్ని ఏడుకొండల వెంకన్న కు అభిషేకారం చేస్తారని అందరికి తెలుసు.
అయితే ఇప్పుడు ఈ పునుగు పిల్లి కాఫీ తాగితే మాత్రం గుండెజారిపోవటం ఖాయమని , పునుగు పిల్లి అభిమానులు చెబుతున్నారు. ఈ మియ్యాం ..మియ్యాం కాఫీ రేటు ఎంతో తెలుసా? వేల రూపాయల్లో ఉంటుంది. ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాఫీ ! కోపీ లువాక్ అని పిలిచే ఆ కాఫీ గింజలు ధర కిలో రూ.35 వేలకు పైమాటే. ఖరీదైన రెస్టారెంట్లలో కప్పు కాఫీ ధర రూ.5 వేలు!
ఇంతకీ ఈ కాఫీ ఎలా త యారుచేస్తారంటే.. ముందుగా వీటితో కాఫీ పళ్లను తినిపిస్తారు. పునుగు పిల్లులు వాటిని తిని.. జీర్ణం చేసుకోగా.. మిగిలిపోయిన గింజలను విసర్జిస్తాయి. వాటిని ఎండబెట్టి.. అమ్ముతారు. పునుగు పిల్లి విసర్జించిన గింజలతో చేసిన కాఫీ రుచి మృదుమధురంగా ఉంటుందట.
ఎందుకిలా అంటే.. పునుగు పిల్లులకు ఎన్ని కాఫీ పళ్లు పెట్టినా.. నాణ్యమైన వాటినే తింటాయట. పైగా.. వాటి జీర్ణాశయంలో ఉండే ఎంజైమ్ల వల్ల గింజలకు ఆ ప్రత్యేకమైన రుచి వస్తుందట. ముఖ్యంగా ఇండోనేసియాలో ఈ తరహా కాఫీ తయారీ ఎక్కువ.
ఈ మియ్యాం .. మియ్యాం కాఫీ రుచి నచ్చటతో.. పునుగు పిల్లులకు కష్టాలు వచ్చానట్లు తెలుస్తోంది. అడువుల్లో హాయిగా తిరిగే పునుగు పిల్లి, ఇప్పుడు పంజరంలో ఖైదీగా మారిపోతుంది. ఇప్పుడు దీనిపై వన్యప్రాణి హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more