(Image source from: Chandrababu naidu independece day plans kurnool town)
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఇప్పటివరకు పూర్తిగా క్లారిఫికేషన్ అయితే రాలేదు కానీ.. బహుశా ‘‘కర్నూలు’’ను ఎంపిక చేసే అవకాశాలు వున్నాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాబు వ్యవహరిస్తున్న తాజా పరిణామాలను చూస్తుంటే ఇటువంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆగస్టు 15వ తేదీనాడు తెలుస్తాయని చెప్పుకుంటున్నారు.
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రరాష్ట్రానికి రాజధానిగా కర్నూలు వున్న విషయం తెలిసిందే! స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం 1956వరకు ఇక్కడ వరుసగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించుకునేవారు. కానీ రాజధాని హైదరాబాద్ కు తరలివెళ్లిపోవడంతో.. అప్పటి నుంచి ఇప్పటివరకు అది బోసిగానే వుండిపోయింది. కానీ ఇన్నాళ్ల తరువాత తిరిగి కర్నూలు జిల్లాలకు ఆ వేడుకల శోభ రాబోతోంది. విభజన తర్వాత మొదటిసారిగా ఏపీ సర్కార్ కర్నూలులో ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య వేడుకల్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంది. దీంతో కర్నూల్ టౌన్ మొత్తం ఎన్నడూలేని విధంగా చాలా సుందరంగా ముస్తాబవుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం వేగంగా పూర్తి చేస్తోంది!
విభజన తర్వాత కర్నూలులో మొదటి వేడుకలు కావడంతో భారీ భద్రతల మధ్య ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘‘ఏపీ సన్ రైజ్’’ అనే పేరుతో ఈ వేడుకలను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీఎస్పీ రెండో బెటాలియన్ గ్రౌండ్ ను అధికారులు ఎంపిక చేసుకున్నారు. ఈ వేడుకలను వీక్షించేందుకు నగర ప్రజలకు వీలుగా భారీ లెడ్ స్ర్కీన్లను కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ విధంగా అట్టహాసంగా ఇలా వేడుకలు నిర్వహించడంపై కొంతమంది రాజకీయ నేతలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కర్నూలును ఎన్నుకునే సూచనలున్నాయని.. అందువల్లే ఇలా వేడుకలు నిర్వహిస్తున్నారని చెప్పుకుంటున్నారు.
ఇదిలావుండగా.. కర్నూలు నగర ప్రజలందరూ తమ పట్టణాభివృద్ధికి ఏవైనా పథకాలు అమలు చేయాలని బాబును డిమాండ్ చేస్తున్నారు. రాజధాని తరలిపోయిన అనంతరం కర్నూలును పట్టించుకున్న నాథుడే లేడని.. ఇప్పుడైనా దీనిపై దృష్టి సారించి పెండింగ్ లో వున్న ప్రాజెక్టులు, ఉద్యోగ - ఉపాధి అవకాశాలను కల్పించేలా చేయాలని వారు కోరుతున్నారు. ఇంతేకాదు.. కర్నూలునే ఏపీ రాజధానిగా నియమించాలని అక్కడి ప్రజలు మాంచి ఊపుమీద డిమాండ్లతో ముందుకొస్తున్నారు. మరి దీనిపై చంద్రబాబు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు..? ఆంధ్ర రాజధానిగా కర్నూలును నియమిస్తారా..? లేదా..? అన్న విషయాల గురించి తెలుసుకోవాలంటే ఆగస్టు 15వరకు ఆగాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more