(Image source from: irrigation minister harish rao clarification farmers about power cuts)
గతకొన్ని రోజుల నుంచి తెలంగాణాలో తీవ్ర విద్యుత్ కొరత వున్న విషయం విదితమే! దీంతో పట్టణాల్లో వున్న ప్రజలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వుంటున్న రైతులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కనీసం ఒక గంటసేపు వరకు కూడా విద్యుత్తు సరఫరా లేకపోవడంతో పంటలు సాగు చేసుకోవడానికి చాలా కష్టం అవుతోందని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు... తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మను సైతం దహనం చేశారు. ఈ ఘటన జరిగిన తరువాతి రోజే కేసీఆర్ ఈ విషయంపై స్పందించి, రైతులకు విద్యుత్ కొరత లేకుండా చేస్తామని... ఆంధ్ర ప్రభుత్వంతో రావాల్సిన 710 మెగావాట్ల కోసం పోరాడుతామని హామీ కూడా ఇచ్చేశారు.
ఇదిలావుండగా.. ఈ విద్యుత్ కొరత అంశంపైనే తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి హరీశ్ రావు కూడా తాజాగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో వున్న రైతులకు పూర్తి స్థాయిలో విద్యుత్తును అందిస్తామని ఆయన హామీ ప్రకటించారు. అందుకు అవసరమైతే పరిశ్రమలకు అందుతున్న విద్యుత్ ను రెండురోజులపాటు కోతలు విధించి, రైతులకు సప్లై చేస్తామని ఆయన వెల్లడించారు. అలాగే వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం మహబూబ్ నగర్ లో 5 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే.. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయల్ సాగర్, ఆర్డీఎస్ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more