పేల్చివేసిన మలేషియా విమానం ఎమ్ హెచ్ 17 లో మృతి చెందిన వారి 219 శవాలను ఆదివారం రష్యన్ మద్దతుదార్లు, ఉక్రైన్ లో వేర్పాటు వాదులు ఎత్తుకునివెళ్ళారు. 192 శవాలను, మరో 8 చెల్లాచెదరైన శరీర భాగాలను విమానం పడిపోయిన స్థలానికి దగ్గర్లోనే ఉన్న టోరేజ్ స్టేషన్లో ఉన్న రిఫ్రెజరేటెడ్ రైల్లో పెట్టారని ఆర్ఐఏ నోవస్తీ చేసిన ప్రకటన.
ఆమ్ స్టెరిడమ్ నుండి కౌలాలంపూర్ కి బయలుదేరిన మలేషియన్ బోయింగ్ 777 ఎమ హెచ్ 17 ని ఉక్రైన్ సరిహద్దులో క్షిపణితో పేల్చివేయగా అందులో ప్రయాణం చేస్తున్న 298 మంది మరణించారు. అందులో లభించిన 219 శవాలను మిలిటెంట్ లు స్వాధీనం చేసుకున్నారు.
టోరేజ్ స్టేషన్లో ఉన్న రైలు అక్కడి నుండి వెళ్ళిపోయిందని ముందు వార్తలు వచ్చినా ఆ తర్వాత ఆ రైలు అక్కడే ఉందని తెలిసింది. డోనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ వేర్పాటు ఉద్యమ సంస్థకు తనకు తానుగా ప్రధానమంత్రిగా ప్రకటించుకున్న అలెగ్జాండర్ బోరోడాయ్. బోరోడాయ్ తన చర్యను సమర్థించుకుంటూ తన సైనికులు మృతిచెందినవారి కుటుంబాలకు గౌరవమిస్తూ శవాలను అక్కడి నుండి తరలించామని అన్నారు. వాటిని రిఫ్రెజెరేటెడ్ ట్రైన్ లో పెట్టామని, వైద్యనిపుణులు వచ్చేంత వరకు అవి అక్కడే ఉంటాయని అన్నారు. ఇంకా, వేడి ఎక్కువవటం వలన, కుక్కల బెడద వలన శవాలు పాడై పోకుండా ఉండటం కోసమే వాటిని తరలించవలసివచ్చిందని కూడా బోరోడాయ ప్రకటించారు.
యూరోపియన్ దేశాలన్నీ ఈ సంఘటన మీద స్పందిస్తూ, ఉక్రైన్ లో వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న స్థలంలో జరిగిన ఈ ఘటన మీద దర్యాప్తు చెయ్యటానికి రష్యా సహకరించాలని ఒత్తిడి తెస్తున్నారు. దీని మీద అమెరికన్ స్టేట్ సెక్రటరీ జాన్ కెర్రీ మాట్లాడుతూ, అక్కడ పరిశీలించవలసిన సాక్ష్యాధారాలు ఎన్నో ఉన్నాయని, అందుకు రష్యా సహకరించాలని చెప్తూ, ఈ ఘటనలో బాధ్యత వహిస్తూ రష్యా ఇవ్వవలసిన వివరణ చాలా ఉందని అన్నారు.
అలాగే ఫ్రెంచ్ ప్రెసిడెంట్, జర్మన్ ఛాన్సలర్, బ్రిటిష్ ప్రధానమంత్రి కూడా దర్యాప్తుకు రష్యా సహకరించాలని అన్నారు.
విషాదకరమైన విమానాన్ని కూల్చివేసిన ఘటనలో చిన్న పిల్లలు, విహారయాత్రకు వెళ్ళిన 80 మంది యువత కూడా ఉన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more