గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు జిహెచ్ఎమ్ సి అక్రమ నిర్మాణాలను గుర్తించి భారీగా వాటిని కూల్చివేసే పనిలో పడింది.
ఇంతవరకు 44 భవనాలు కూల్చివేయగా అవన్నీ తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతాలవటం కేవలం కాకతాళీయమా లేక కక్ష సాధింపు చర్యా అన్న చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో. ఈ విషయంలో ఆందోళన చేస్తూ ఆ పార్టీల కార్పరేటర్లు జిహెచ్ ఎంసి ప్రధాన కార్యాలయంలో ధర్నాలు, ఘెరావ్ లు చేసారు. అయితే, స్టాండింగ్ కమిటీ సిఫారసులు ఏమైనా కానీ ప్రభుత్వ ఆదేశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటానని కమిషనర్ తేల్చి చెప్పారు.
తెలంగాణా రాష్ట్ర సమితి ప్రాతినిధ్యం ఉన్న చోట కూల్చివేతలు లేకపోవటం, పాత బస్తీ వైపు కన్నెత్తైనా చూడకపోవటం, ఎదిరించలేని ప్రాంత జనాల ఆవాసాలను మాత్రమే కూల్చివేతలకు గురిచెయ్యటం కేవలం కాకతాళీయమా లేకపోతే ఇతర పార్టీల ఆరోపణలను నిజమా అన్నది తెలియటానికి ఇంకా సమయం ఉంది. ఎందుకంటే గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో మొత్తం 900 అక్రమ నిర్మాణాలను గుర్తించామని జిహెచ్ఎంసి చెప్తోంది- ఏ ప్రాతిపదికన అవి అక్రమ నిర్మాణాలయ్యాయో చెప్పకపోయినా.
పాతబస్తీలోకి పోయి చూస్తే మాత్రం జిహెచ్ఎంసి కి చేతినిండా పని దొరుకుతుందని రాజకీయ వర్గాలలో అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడ చాలవరకు అక్కడ నియమాలను ఉల్లంఘించిన కట్టడాలే కనపడతాయి. కాకపోతే ఆ ధైర్యం చేసి కెసిఆర్ ప్రభుత్వం తన చిత్త శుద్ధిని చాటుతుందా అన్నది అనుమానమేనని కూడా అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఎమ్ఐఎమ్ ప్రాబల్యం చాలా ఎక్కువ. ఎమ్ఐఎమ్ తో తెరాస పెట్టుకోదని అని చెప్తున్నారు.
అయితే మొదలైంది ఇప్పుడే, పైగా పని ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలిగా కాబట్టి కూల్చివేతల్లో పై పరిశీలనలు కేవలం కాకతాళీయమా లేక అనుకోని చేసిందా అన్నది నిర్ణయించటానికి ఇంకా సమయం ఉంది!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more