అధికారంలేని కాంగ్రెస్ పార్టీ బూడిద పై బిజేపి పార్టీతోఫైట్ చేస్తుంది. దీంతో ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ లో సరికొత్త భయం పట్టుకుంది. అధికారంలో వచ్చిన వెంటనే.. బిజేపి పార్టీకి తలనొప్పులు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వాటిపై బీజేపి సర్కార్ లోతుగా పరిశీలించి బయటకు తీస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో బిజేపి ఒక వివాదంలో పడింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ .. కొన్ని ఆదేశాలు జారీ చేయటం అధికారులు తూ.చ పాటించటం జరిగింది.
దీంతో బీజేపి కొత్త తలనొప్పులు వచ్చాయి. మోడీ ఆదేశాలతో అధికారులు కీలక పత్రాలు ధ్వంసం చేశారు. ఇందులో చరిత్రకు సంబంధించినవి కూడా ఉన్నాయని పత్రికల్లో కథనాలొచ్చాయి. గాంధీజీ హత్యకు సంబంధించిన పత్రాలు ద్వంసం చేశారని ప్రధానంగా ఆరోపణలున్నాయి. దీనిపై సర్కార్ సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే 11వేల ఫైల్స్ మాత్రమే ధ్వంసం చేశామని.. ఇందులో విపక్షాలు ఆరోపిస్తున్నట్టు చరిత్రకు సంబంధించిన కీలకపత్రాలేమీ లేవని రాజ్నాధ్ సింగ్ చెబుతున్నారు.
వామపక్షాలు సహా పలు పార్టీలు అధికార పార్టీ తీరును ఎండగడుతున్నాయి. ఒక్కో ఫైల్ను 45సెకన్లు కూడా పరిశీలించకుండానే ధ్వంసం చేశారని సీపీఎం ఆరోపిస్తోంది. దీనిని బట్టి చరిత్రకు బీజేపీ ఎంత ప్రాధాన్యతనిస్తుందో అర్థమవుతుందన్నారు. రాజ్నాధ్ సింగ్ చెబుతున్నట్టు 11వేల ఫైల్స్ ధ్వంసం చేసిన సర్కార్ వాటి సమగ్ర వివరాలు ఇవ్వాలని జేడీయూ నేతలు డిమాండ్ చేశారు. ధ్వంసం చేసిన పత్రాల వివరాలు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని పట్టుబడుతున్నారు.
ఈ వ్వవహారంలో కాంగ్రెస్ కూడా బీజేపీని కార్నర్ చేస్తోంది. ధ్వంసం చేసిన ఫైల్స్ ను మైక్రో ఫిల్మింగ్ చేశారా లేదా అన్నది ప్రభుత్వం చెప్పకపోవడాన్ని తప్పుబడుతోంది. ఆరోపణలున్నట్టు చరిత్రకు సంబంధించిన ఫైల్స్ ఇందులో ఉన్నాయా.. అసలు ఫైల్స్ ధ్వంసం చేసిన విధానంపై కూడా వివరాలు అందజేయాలని కాంగ్రెస్ కోరుతోంది. మొత్తానికి బీజేపీకి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. కార్యాలయాలు శుభ్రంగా ఉండాలి... కానీ ముందు వెనకా చూడకుండా అంతా చెత్తే అని బుట్టలో పడేస్తే జరిగే నష్టమేంటో బీజేపీ సర్కార్కు ఇప్పుడు తెలిసొస్తోంది.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more