మోడీయా గీడీయా అంటూ ఎన్నికల ముందు నరేంద్ర మోదీని తూలనాడిన కెసిఆర్ కి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అప్పుడే తెలియజెప్పారు అలాంటి మాటలు మాట్లాడవద్దని. నన్ను తిట్టినా సహిస్తాను కాని మోదీ గారిని ఏమన్నా నేను సహించలేనని కూడా పవన్ కళ్యాణ్ ఆ రోజే అన్నారు. అయితే ఇప్పడు అదంతా ఎందుకు గుర్తుకొస్తోందంటే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణా విషయంలో అన్యాయం చేసారని, అందుకు కారణం ముఖ్యమంత్రి కెసిఆర్ అప్పట్లో చూపించిన మాట దురుసేనని తెరాస లో కూడా కొందరు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది కాబట్టి.
రేప్పొద్దున ఆయన ప్రధాన మంత్రి అవటం ఖాయం, మీరు మీ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవాలంటే కేంద్రంతో సఖ్యతగా ఉండటం అవసరం అని కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరించటం జరిగింది. అదంతా గుర్తుకొచ్చిన కొందరు నాయకులు కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులను చూసి వేదన చెందటం సహజమే. పైగా విడిచి వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ కేమో వరాల మూటలు అందించటం జరిగింది.
అయితే ఇదంతా కేవలం ఊహాజనితమే. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల పట్లా సమానంగా వ్యవహరిస్తుంది. నిజం చెప్పాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోనూ అదే పార్టీ అధికారంలో ఉండటం వలన ఆంధ్రప్రదేశ ని అసలు పట్టించుకోనేలేదు. ఇంకా మిత్ర పక్షాలు ఎక్కడ అలకచెందుతాయో, చేయి వదిలిపెడతాయో అని ఆ పార్టీలకు కాస్తంత మొగ్గు చూపించారు కానీ అదే పార్టీ పాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ ఎంతమాత్రం విలువివ్వలేదు. అసలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ నే అప్పుడు పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన వలన రెండు ప్రాంతాలలోను కాంగ్రెస్ లేకుండా పోతుంది, అదే నా బాధంతా అని చెప్పినా పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ పార్టీ లా కాకుండా భారతీయ జనతా పార్టీ సమతౌల్యత పాటిస్తోందని తెలుస్తోంది.
కాబట్టి అప్పుడేదో కెసిఆర్ అన్న మాటలను జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని అందుకు బదులుగా తెలంగాణా రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తున్నారన్న మాటలు నిరాధారమైనవి. పాత ప్రభుత్వం చేసిన వాగ్దానాలను దృష్టిలో పెట్టుకుని, ఆదాయ వనరులు తగ్గిపోయిన ఆంధ్రప్రదేశ్ కి ఆర్థికంగా సాయపడటమే ఉద్దేశ్యంగా కనపడుతోంది కానీ ఆ ప్రాజెక్ట్ లతో పోల్చి తెలంగాణా రాష్ట్రానికి అన్యాయం చేసారని, అందుకు కెసిఆర్ కారకులని అనటం సరికాదు.
ఎన్నికల సమయంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల శ్రేయస్సులో, తమ పార్టీ ప్రయోజనంలో ఎన్నో మాటలు అంటారు. అవన్నీ వ్యక్తిగత ధూషణలు కాజాలవు కదా! పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యం కూడా హితవు చెప్పాలనే కానీ నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా కక్ష్య సాధించే మనిషని ఆయన ఉద్దేశ్యం కాదు
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more