ఆంద్రప్రదేశ్ లో చట్ట సవరణలు చేయటానికి కేంద్రం అడుగులు వేస్తుంది. రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ లో ఐఐటీ , ఐఐఎం వంటి సంస్థలతో పాటు సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానిిక అవసరమైన చట్ట సవరణలను చేయాలని కేంద్రం మాన వనరుల శాఖ భావిస్తోంది.
అలాగే గత ప్రభుత్వ హయాంలోనే ఆంధ్రప్రదేశ్ను విభజించే బిల్లు చట్లమైనా, తెలంగాణ ఏర్పాటు తరువాత మిగిలిన ఆంధ్రప్రదేశ్లో ఐఐఎం, ఐఐటీ, సెంట్రల్ వర్సిటీలను ఏర్పాటు చేయడానికి అవసరమైన చట్టాలు చేయలేదు లేదా సవరించలేదు. దేశ వాప్తంగా ఆయా విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఇచ్చే సర్టిపికెట్ల ఎలక్ర్టానిక్ డేటాబేస్ను రూపొందించేదుకు కూడా రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే మానవ వనరుల శాఖ ప్రయత్నాలు చేస్తోంది.
అలాగే దేశవ్యాప్తంగా విద్యార్థులు పొందే డిగ్రీలకు నకిలీలు రూపొందే అవకాశం లేకుండా దేశవ్యాప్త ఎలక్ర్టానిక్ డేటాబేస్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదించినా, లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం రాక, అలాగే మరుగునపడిపోయింది.
అయితే ఇప్పుడు అదే బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం చట్టంగా రూపొందిచే ప్రయత్నం చేస్తోంది. ఈ డేటాబేస్ ఏర్పాటు చట్టమైతే, జాతీయ అకడమిక్ డిపాసిటరీని కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ డేటాబేస్ రూపకల్పనకు ప్రైవేట్ సంస్థల సాయం తీసుకోవాలని గత బిల్లులో ప్రతిపాదించినా, ప్రస్తుత బిల్లులో యూజీసీ, ఏఐసీటీఈ, సీబీఎస్ఈ వంటి సంస్థల సాయంతో ఏర్పాటు చేస్తారు. విజయవాడ, భోపాల్లోని స్కూల్ ఆప్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్పీఏ) విద్యార్థులు తమ డిగ్రీలు పొందేలా చట్ట సవరణలు చేసే అవకాశం ఉంది.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more