తెలంగాణా రాష్ట్రంలో నివాసముంటున్నవారికి రేషన్ కార్డ్ లు ఇవ్వము అని తెలంగాణా ప్రభుత్వం అనలేదు. గ్యాస్ సబ్సిడి, మౌలిక సదుపాయాలు, ఆస్తీ ప్రాణాలకు భద్రత, ఇవన్నీ అందరికీ సమానమే. వ్యాపారావకాశాలు కూడా అందరికీ సమానమే. కట్టవలసిన పన్నులూ సమానమే. కేవలం ప్రభుత్వ ఉద్యోగావకాశాలు, విద్యార్థుల ఫీజు చెల్లింపులలోనే తెలంగాణా ప్రభుత్వం పట్టుబడుతోంది. ఉద్యోగావకాశాలకు చెందిన స్థానికత గురించి మార్గదర్శకాలింకా వెలువడలేదు కానీ విద్యార్థుల ఫీజు చెల్లింపుల విషయంలో మాత్రం 1956 వ సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఆ సంవత్సరం నుంచి ఉన్నవారినే ఫీజు చెల్లింపుల విషయంలో స్థానికత ఉన్నట్లుగా గుర్తిస్తోంది.
ఇది తెలంగాణా బడ్జెట్ కి సంబంధించిన విషయం కాబట్టి ప్రభుత్వానికున్న ఆర్థిక వెసులుబాటులో ఎవరికి ఫీజులను చెల్లించాలి అన్నది నిర్ణయించుకునే అధికారం తెలంగాణా ప్రభుత్వానికుంది.
ఋణ మాఫీల విషయంలో ఎలాగైతే లక్షరూపాయల పరిమితి వరకు చేస్తామని, పంట ఋణాలమీద మాత్రమే మాఫీలుంటాయని చెప్పినట్లుగా రాష్ట్ర బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. దాన్ని అన్యాయం అక్రమం అనవలసిన అవసరం లేదు. కాకపోతే ఇప్పటివరకు కలిసివున్నాం కాబట్టి, తెలంగాణా విడిపోయిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ లో ఆదాయ వనరులు గణనీయంగా తగ్గిపోయాయి కాబట్టి ఈ సందర్భంలో ఫీజు రియంబర్స్ మెంట్ కి అర్హత దక్కనివారికి కాస్త మనస్తాపం కలిగే అవకాశం ఉంది.
రైతు ఋణమాఫీల మీద కూడా నిరసనలు వచ్చాయి కానీ ఫీజు రియంబర్స్ మెంటు విషయంలో వచ్చిన నిరసనలు వేరేవిధంగా ఉన్నాయి, తెలంగాణా విద్యార్థుల ఫీజు చెల్లిస్తాం కానీ ఆంధ్రా విద్యార్థుల ఫీజుని మేమెందుకు చెల్లిస్తాం అనే బదులు మేము 1956 సంవత్సరంలోని స్థానికతనే పరిగణనలోకి తీసుకోగలుగుతాం అని ఉంటే దాని ప్రభావం మరోలా ఉండివుండేదేమో. ఆ తర్వాత తెలంగాణాలో ఉన్నవాళ్ళు కూడా తెలంగాణా స్థానికులే కానీ వాళ్ళకు మేము ఈ పథకంలో పైసలు ఇవ్వలేము అని కూడా అని ఉండవచ్చు.
అందరూ రాష్ట్రవాసులే కానీ కేవలం వికలాంగులకే ఫలానా రాయితీ ఇస్తాము లేదా ఫలానా వెనకబడిన కులాలకే ఫలానా ప్రయోజనాన్ని కలిగిస్తాము అని అన్నట్లుగానే దీన్ని కూడా భావిస్తే వచ్చే వ్యతిరేకతలుండవు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more