మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య అనుమానస్పదమైన పరిస్థితులలో ఫైవ్ స్టార్ హోటల్లో మరణించిన కేసు కొత్త మలుపులు తిరిగింది. ఇప్పటివరకు అంతు తెలియకుండా ఉన్న ఈ కేసులో ఆల్ ఇండియా మెడికల్ ఇన్ స్టిట్యూట్ లో పని చేసే సీనియర్ డాక్టర్ వాంగ్మూలంతో కొత్త కోణం బయపడింది.
ఎయిమ్స్ లోని డాక్టర్ సుధీర్ గుప్తా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో ఇచ్చిన అఫిడవిట్ లో కేంద్ర మంత్రి, ఎయిమ్స్ ప్రెసిడెంటైన గులామ్ నబీ ఆజాద్ తనని తన వృత్తికి వ్యతిరేకంగా సునంద పుష్కర్ మరణానికి సంబంధించిన విషయాలను కప్పిపుచ్చటం కోసం ఒత్తిడి చేసారని పేర్కొన్నారు.
ఒకపక్క ఎయిమ్స్ ప్రెసిడెంట్ గులామ్ నబి ఆజాద్, మరోపక్క మృతి చెందిన సునంద పుష్కర్ భర్త కూడా ఆరోగ్య శాఖా మంత్రిగా పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులని, అందువలన అప్పట్లో ఈ విషయాన్ని చెప్పటానికి తనకి ధైర్యం లేకపోయిందని, డాక్టర్ సుధీర్ గుప్తా వెల్లడించారు.
సునంద పుష్కర్ శవపరీక్ష చేసిన వైద్యుల బృందానికి నాయకత్వే వహించిన గుప్తా తన నివేదికను గుప్తంగా ఉంచమని, అందుకే సీల్డ్ కవర్ లో ఇస్తున్నానని కోరారు. ఆయన తను చేసిన ఆరోపణలకు ఆధారంగా ఎయిమ్స డైరెక్టర్, శశి థరూర్ మధ్య నడిచిన ఇమెల్స్ కాపీలను కూడా తన అఫిడవిట్ కి జతపరచారు.
అయితే ఇదంతా ఇప్పుడెందుకు బయటకు వచ్చిందంటే, ఎన్డియే ప్రభుత్వం రాగానే డాక్టర్ గుప్తా సీనియారిటీ ప్రమాదంలో పడింది. ఆయన్ని శాఖాధికారి పదవి నుంచి తొలగిస్తున్నారని, డాక్టర్ ఒపి మూర్తికి ఆ పట్టం కడుతున్నారని తెలిసి ఆయన కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి డా.హర్షవర్ధన్ కి ఆ చర్య ఎయిమ్స్ నియమావళికి విరుద్ధమని లేఖ రాసారు.
శశి థరూర్ భార్య సునంద పుష్కర్ తన భర్తకి, పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహ్ర్ తరార్ కి మధ్య సంబంధమున్నదని అంటూ ట్విట్టర్ లో విమర్శించిన కొన్ని రోజులలోనే ఆమె ఒక ఫైవ్ స్టార్ హోటల్లో శవంగా మారింది. అయితే ఆ జర్నలిస్ట్ ఆరోపణ తప్పని చెప్పటం కూడా జరిగింది.
సునంద పుష్కర్ చనిపోయిన విధానం ఎన్నో అనుమానాలను రేకెత్తించింది. కానీ దేనికీ సమాధానం దొరకలేదు. డాక్టర్ గుప్తా ప్రకటనలతో ఆ చిక్కుముడులు విడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో జరిగే ఎన్నో విషయాల మీద బాహాటంగా ఆరోపణలు చేస్తూ కోర్టులో పిటిషన్ లు వేసే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ కేసు మీద పలు అనుమానాలను వ్యక్తం చేసారు. పోలీసులు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సమయంలో శశి థరూర్ ఎందుకంత భయపడిపోయారని కూడా ఆయన అప్పట్లో ప్రశ్నించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more