విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధాని నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి మొగ్గు చూపిస్తున్నా, ఆ ప్రాంతంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పైగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వెనుక నున్న నంబూరు, లామ్ మొదలైన ప్రాంతాలలోని భూమి సారవంతమైనది కావటంతో దాన్ని నిర్మాణాలకు ఉపయోగించదలచుకోలదని సమాచారం. ఇప్పుడు తాజాగా అమరావతిని రాజధానిగా చేస్తే ఎలా ఉంటుందన్నదానిలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి.
అమరావతి రాజధానిగా మారితే అది నదీప్రాంతంలో ఉంటుంది కాబట్టి నీటికి కొదవు ఉండదనే అభిప్రాయం ఉన్నా, వరదలు వస్తే ఎలా అన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అమరావతి మండలంలో 10929 ఎకరాల ప్రభుత్వ అటవీ భూమి ఉన్నట్లుగా రికార్డ్ లు తెలుపుతున్నాయి. తాడికొండ మండలంలో ఉన్న 6982 ఎకరాలను, అచ్చంపేటలో ఉన్న 16327 ఎకరాల భూమిని కూడా పరిశీలిస్తున్నారు.
కొత్త రాజధానిని జాతీయ రహదారులతో అనుసంధానం చెయ్యటానికి రోడ్లు, కృష్ణా నదికి ఇరువైపులా రాజధాని విస్తరించేలా వంతెనల నిర్మాణాలు చేపట్టాలనే ఆలోచన కూడా నలుగుతోంది. గొల్లపూడి నుండి మంగళగిరికి ఇప్పటికే వంతెన కట్టటానికి భూసేకరణ పూర్తయింది. అలాగే కంచికచర్ల నుంచి అమరావతికి, నందిగామ నుండి అచ్చంపేటకు కూడా వంతెనలను నిర్మించాలనే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి చంద్రబాబు నాయుడు ఆలోచనలో నదీజలాలలతోను, వంతెనలు, రోడ్లతోనూ నిండిన రాజధాని నగరం రూపుదిద్దుకుంటోందని తెలుస్తోంది. అప్పుడే నగరం సుందరంగా కనపడుతుంది, అన్నిరకాల సదుపాయాలతో విలసిల్లుతుంది కాబట్టి రాజధాని నగరం మీద కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఆ నిర్ణయం జరిగితేకానీ మిగతా పనులు వేగాన్ని అందుకోవు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more