ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014-15 కి గాను ఋణప్రణాళికను విడుదల చేయగా, అది రూ.91,459 కోట్లుగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి నిర్ణయించింది.
హైద్రాబాద్ లోని క్షత్రియ హోటల్ లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఛైర్మన్ సివిఆర్ రాజేంద్రన్ మాట్లాడుతూ, బ్యాంక్ ఋణ మాఫీల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 5980 బాంక్ శాఖల్లో 68 శాతం గ్రామీణ, సెమి అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయని, అతి ముఖ్యమైన ఖరీఫ్ ఋణాలకోసం బ్యాంకులు రూ.56019 కోట్ల రూపాయలను రైతు ఋణాలకు ఇవ్వటానికి నిర్ణయించుకుని, అందులో రూ.41978 కోట్ల రూపాయలను సత్వరం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. మిగిలిన 14041 కోట్ల రూపాయలను నాబార్డ్ సూచనల మేరకు టర్మ్ లోన్ గా ఇవ్వటానికి కేటాయించామని కూడా ఆయన అన్నారు.
అయితే నాయకులు చేసిన ఋణమాఫీల హామీలతో రెండు సంవత్సరాలుగా రైతులు ఋణాలను చెల్లించటం లేదని, అంతేకాకుండా ఋణాలను సకాలంలో చెల్లించటం వలన కలిగే లాభాలను వివరిస్తూ రైతులు చైతన్య పరచటానికి వెళ్తున్న సిబ్బందిని అడ్డుకుంటున్నారని దానితో బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటోందని ఈ సమావేశంలో ఆవేదన వ్యక్తం చెయ్యటం జరిగింది.
పోయిన సంవత్సరం బ్యాంక్ లు 37058 కోట్ల రూపాయల పంట ఋణాలను మంజూరు చెయ్యగా, ఈ సంవత్సరం దాన్ని వృద్ధిచేస్తూ, రూ.41978 వరకు పెంచామని కూడా ఈ సమావేశంలో చెప్పటం జరిగింది.
ఋణమాఫీల సంగతి ఇంకా స్వష్టత రావలసివుందని, అయితే ప్రభుత్వం అమలు పరచదలచుకున్న అన్ని పథకాలకు బ్యాంకింగ్ రంగంనుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని కూడా రాజేంద్రన్ ప్రకటించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more