కోనసీమలో గుండెల్లో.. గ్యాస్ మంటలతో 15 మంది ప్రాణాలు తీసుకొని, కొన్ని వందల మందికి గాయలను చేసిన విషయం దేశం మొత్తం షాక్ తిన్నది. దీంతో రాజకీయ నేతల, రాజకీయ పార్టీలు, అధికార యంత్రంగం అంత కోన సీమ నగరానికి బయలుదేరి వెళ్లి .. గ్యాస్ పైపు లైన్ పేలుడు బాధితులను ఒ పరామార్శించే పనిలో బిజీగా ఉన్నారు.
ఈరోజు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ .. నగరం గ్యాస్ పైపులైన్ పేలుడు బాధితులను పరామర్శించేందుకు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లటం జరిగింది. ఎంపీగారు బాధితులను ఊరడించే సమయంలో.. కొంతమంది బాధితులు ఎంపీ మురళీమోహన్ వారి బాధలు చెప్పుకోవటం జరిగింది. తమ బతుకులు బుగ్గి అయిపోయాయని, కొబ్బరిచెట్లు మొత్తం కాలిపోయాయని, ఇళ్లు ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయని, అయినా ఎవరూ ఆదుకోలేదని అన్నారు. అంతేకాకుండా నిలువ నీడ కూడా లేకుండా పోయిన తమవాళ్లను ఎవరూ పట్టించుకోవట్లేదని, కనీస సాయం కూడా అందించలేదని మరికొందరు మహిళలు ఆయన దృష్టికి తీసుకురాగా, అందరినీ సొంతమనుషుల్లా వారిని ఊరడించారు. కానీ ఇదే సమమయంలో కొంతమంది నకిలి బాధితులు ఎంపీని టార్గెట్ చేసుకోని, జగన్ పార్టీ ఉంటే.. మాకు న్యాయం జరిగేదని ఎంపీ పై విరుచుకుపడ్డారు.
అక్కడ మాట్లాడుతున్న బాధితుల తీరు ఎలా ఉందంటే.. ‘‘మీకు న్యాయం చేస్తాం అని టిడిపి ఎంపీ మురళీ మోహన్ చెబుతున్నా’’ ఆయన మాటలు వినకుండా .. ఎంపీ గో బ్యాక్ అంటూ.. నకిలి బాధితులు నినాదాలు చేయటంతో.. ఎంపీగారికి ఆవేశం కట్టలు తెంచుకుంది. దీంతో ఎంపీ ''మీడియా ఉండబట్టే కదా మీరింతగా రెచ్చిపోతున్నారు.. మీడియా ముందు వద్దు, లోపలకు రండి మాట్లాడుకుందాం రండి అని చెప్పిన వినిపించుకోకుండా.. ఎంపీ విమర్శలు కురిపించారు.
తమకు ఎలాంటి సాయం అందలేదని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, చుట్టపుచూపుగా వచ్చి పలకరించినంత మాత్రాన ఏమీ అయిపోదని కొంతమంది బాధితులు ఎంపీ మురళీమోహన్ ను కాకినాడ ఆస్పత్రిలో నిలదీశారు. దీంతో ఎంపీ సైలెంట్ గా ..అక్కడ నుండి వెళ్లిపోవటం జరిగింది. ఆయన వెళ్లిన వెంటనే..నకిలీ బాధితులు కూడా అక్కడ నుండి వెళ్లిపోయారు. దీంతో అసల బాధితులు ఎంపీకి కష్టాలు చెప్పుకుందని వస్తే ఇలా జరిగిందేంటీ? అని నగరం బాధితులు లబోదిబోమని ఏడుస్తూ.. నకిలీ బాధితులపై.. శాపనార్థాలు పెడుతూ.. వచ్చే అధికారుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more