అఖండ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యను కూడా నరసింహన్ లాగానే జోడు రాష్ట్రాల సవారీకి పురమాయించటం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రస్తుతం రెండు రాష్ట్రాలకూ ఇఎస్ఎల్ నరసింహన్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నట్లుగానే తమిళనాడు గవర్నర్ గా పనిచేస్తున్న రోశయ్యకు అదనంగా కర్నాటక రాష్ట్ర గవర్నర్ బాధ్యతలను కూడా తాత్కాలికంగా చేపట్టవలసివస్తోంది.
కర్నాటక గవర్నర్ భరద్వాజ పదవీ విరమణ చెయ్యటంతో రోశయ్యను అదనపు బాధ్యతలను తీసుకోమని ఆదేశించటం జరిగింది. ఆయన త్వరలోనే కర్నాటక గవర్నర్ గా కూడా ప్రమాణస్వీకారం చేస్తారు.
గవర్నర్ పదవులలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు భాజపా ప్రభుత్వం ఉద్వాసన చెప్పే ప్రయత్నంలో ఉంది. కానీ ఆ స్థానాలను భర్తీ చెయ్యటానికి ఇంకా జాబితా పూర్తవనట్లుగా ఉంది. అందువలన మిగిలిన గవర్నర్ లకు రాజీనామా చెయ్యమని పిలుపులు వెళ్ళినా నరసింహన్, రోశయ్యలాంటి వివాదరహిత నాయకులను ప్రస్తుతానికి భాజపా ప్రభుత్వం కదలించే ప్రయత్నాలేమీ చెయ్యలేదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more