వైద్యులు లేని చోట మంత్రసానులు (మిడ్ వైఫ్) పేదలపాలిటి పెన్నిధిలా పనిచేస్తారు. కాన్పులలో ప్రత్యేకమైన శిక్షణతో అదే పనిలో ఉండటం వలన వాళ్ళ అనుభవం అత్యవసర పరిస్థితుల్లో బాగా పనిచేస్తుంది.
నాలుగు దశాబ్దాల వెనక్కి పోతే భారత దేశంలో కాన్పులు ఇళ్ళల్లోనే జరిగేవి. పురిటి నొప్పలు వచ్చినప్పుడు మంత్రసానికి కబురుపంపేవారు. మంత్రసాని వస్తూనే పరిస్థితిని అవగాహన చేసుకుని కావలసిన వస్తువులను అడిగి తీసుకుని కాన్పుకి కావలసిన ఉపచారాలను మొదలుపెట్టేది. ఆ తర్వాత కాలంలో ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన వ్యాధులు, కాన్పులలో విశేషమైన శిక్షణ పొందిన వైద్యులు రావటం, నెలనెలా టెస్ట్ లతో మొదటి నెలనుంచే వాళ్ళ నియంత్రణలోకి పోవటం మొదలైంది.
పూర్వకాలంలో సిజేరియన్ లు లేనేలేవు. ఇప్పుడు వైద్య రంగం ఇంత అభివృద్ధి చెందిన తర్వాత భారత దేశంలో నార్మల్ డెలివరీలే అరుదైపోయాయి.
జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్ బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లోని శాస్త్రజ్ఞులు, పేద దేశాలకు సుశిక్షితులైన మంత్రసానులు బాగా ఉపయోగపడతారని అంటున్నారు. ప్రసవకాలంలో తల్లి పిల్లల మరణాలు ఎక్కువైపోతున్న సందర్భంలో వాటిని నివారించటానికి కొన్ని దేశాలు చేపట్టిన మార్గాలు కేవలం నామమాత్ర ఫలితాలనే ఇచ్చాయి. అలాంటప్పుడు పేద దేశాలలో మంత్రసానులే బాగా ఉపయోగపడతారని శాస్త్రజ్ఞలు అంటున్నారు. జూన్ 23 న ది లాన్ సెట్ లో వెలువడిన నివేదిక ప్రకారం తల్లిపిల్లలు గర్భం దాల్చిన దగ్గర్నుంచి ప్రసవం కాలం వరకు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో చనిపోయారని తెలుస్తోంది.
అందువలన సుశిక్షితులైన మంత్రసానులను పేదరికంలో ఉన్న వివిధ దేశాలకు పంపించటం కూడా సత్ఫలితాలనిస్తాయని అంటున్నారు. ఆ విధంగా చాలా క్లిష్టమైన సందర్బాల్లో కూడా తల్లి ప్రాణాన్ని కాపాడవచ్చని ఈ పరిశోధనలో నేతృత్వం వహించిన లిండా బార్లెట్, ఎమ్ డి, ఎమ్ హెచ్ ఎస్ సి అంటున్నారు. ఈమె జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్ బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లోని అంతర్జాతీయ ఆరోగ్య విభాగానికి ఫాకల్టీ మెంబర్ గా వ్యవహరిస్తున్నారు.
అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య తేడాను తెలుసుకోవటానికి కాన్పులలో మహిళలు ప్రాణాలు పోగొట్టున సంఖ్యను కొలమానంగా తీసుకుని నిర్ణయించవచ్చని అంటున్నారు లిండా బార్లెట్. The Impact and Cost of Scaling up Midwifery and Obstetrics in 58 Low- and Middle-Income Countries" అనే పుస్తకాన్ని కూడా ఆమె రచించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more