పంట చేతికి వచ్చేంతవరకు ఎన్ని తిప్పలు పడాలో తెలియదు కానీ, ఖరీఫ్ పంటకు ఆరంభంలోనే హంసపాదులా రైతుకి ముఖం చాటేస్తున్న వానలమ్మ అదనులో రాకుండా దోబూచులాడుతోంది. దానితో విత్తనాలను కాపాడుకోవటానికి రైతులు అంతులేని యాతనలు పడుతున్నారు. మొలకలెత్తనివి ఎలాగూ పోయాయి. కానీ మొలకలెత్తినవి కూడా నీళ్ళివ్వలేదని ముఖం మాడ్చుకుంటున్నాయి.
రైతులు బిందెలతో నీళ్ళు తెచ్చి పోస్తూ మొలకలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇరు రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి. ఇప్పటికీ 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత నమోదవుతోంది. కొన్నిచోట్ల 44 డిగ్రీలకు చేరుకుంటున్న ఉష్ణోగ్రతలో, పొలాలలో వేసిన విత్తనాలు విలవిల్లాడుతూ ప్రాణాలు కాపాడుకోవటం కోసం కొట్టుకుంటున్నాయి.
పశువులకు గ్రాసం కూడా సమకూర్చలేనివారు ఆ పశువులను అమ్ముకుంటున్నారు. వారానికి నాలుగువేల పశువులు కబేళాలకు పోతున్నాయి. విత్తనాలు ఎండిపోయిన చోట మరోసారి దున్నుతున్నారు. తొలకరిని నమ్మి మూడు లక్షల ఎకరాలలో పత్తి విత్తనాలు వేసినవారు పరిస్థితి ఇలాగే ఉంటే 100 కోట్ల వరకు నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది.
ఏం చెయ్యాలో తోచని రైతన్నలు వర్షాలకోసం పూజలు చేస్తున్నారు. తెలంగాణాలో సాగు చెయ్యవలసిన వివిధ పంటలలో కేవలం సగమే పంటలకు నోచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి మరీ దారుణమైపోయింది. 5 శాతం సాగు కూడా పూర్తికాలేదింకా. జలాశయాలు ఎండిపోయాయి. భూగర్భజలాలను వెలికి తీయాలంటే విద్యుత్ లేమి అడ్డుపడుతోంది.
ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ యూనివర్శిటీ శాస్త్రవేత్త దండి రాజిరెడ్డి వ్యవసాయదారులకు ఈ విధంగా సూచనలిచ్చారు.
జూలై 10 వరకు పంటలు వేసుకునేందుకు సమయం ఉంది కాబట్టి రైతులు వర్షాలు పడలేదని ఆదుర్దా పడవద్దు. పైపై చినుకులకు కంగారుపడి విత్తనాలను చల్లవద్దు. భూమి పూర్తిగా తడిచి విత్తనాలు వెయ్యటానికి అనువుగా తయారైనప్పుడే విత్తనాలను వెయ్యాలి. ఈ లోపులో ప్రత్యామ్నాయ పంటలకోసం కూడూ ఎన్జీరంగా యూనివర్శిటీ ఆలోచన చేస్తోంది. వచ్చేవారం ఋతుపవనాలు బలపడవచ్చు. ఎల్ నినో కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని భావించవద్దు.
వర్షాకాలం వచ్చి 20 రోజులైనా ఎండలు కాస్తూ రైతులను కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం ఇది రైతుల కలతే కానీ ఇది మరో కొద్ది రోజులు ఇలాగే సాగితే రాష్ట్రంలో అందరి మీదా దీని ప్రభావం పడుతుంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇప్పటికే వేసిన విత్తనాలను బ్రతికించటం కోసం రైతులు శాయశక్తులా కృషిచేస్తున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more