అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాలకు ఈ సంవత్సరం వర్షాలు ప్రారంభం కాకపోవటం సవాళ్ళనే విసురుతోంది. సినిమా ఆడటం ఆడకపోవటం ఆ సినిమాలోని హీరో హీరోయిన్ల చేతుల్లో ఎలాగైతే ఉండవో, వర్షాలు పడటం పడకపోవటం ప్రభుత్వాల చేతుల్లో ఉండవు కానీ వర్షాలు పడక కరువు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా పథకాలు వేసినా నిందలు పడక తప్పదు.
ఈ సంవత్సరం వర్షాలు గత సంవత్సరాలతో పోల్చి చూస్తే 37 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఇది ఎల్ నినో వలన కాదన్నది ఆశ్చర్యపరచే సత్యం. ఎల్ నినో అనేది 2 నుంచి 7 సంవత్సరాల మధ్యలో కరువుకాటకాలు, వరదలు, పంటలు నాశనమవటం జరిగే వాతావరణ వైపరిత్యం. ఇది ఆగస్ట్ నెలలో సంభవించే అవకాశం ఉంది. కానీ వర్షాలు ఆలస్యమవటం కేవలం ప్రాకృతికం. ఈ నెలలో సర్దుకునే అవకాశం కూడా తక్కువగానే కనిపిస్తోందని, జూలై మొదటివారానికి కానీ వర్షాలు అందుకోవని ఇండియా మెటీరియోలాజికల్ డిపార్ట్ మెంట్ లో లాంగ్ రేంజ్ ఫోర్ కాస్టింగ్ విభాగానికి ఛీఫ్ శివానంద పాయ్ అన్నారు.
వర్షాలు ఆలస్యమవటమనేది సామాన్యంగా సంభవిస్తూనేవుంటుంది. కానీ ఋతువులో రాబోయే కాలంలో అవి అందుకునే దాన్నిబట్టి ఉంటుంది ఫలితమనేది. ఋతుపవనాలు ఆలస్యమైంది కేవలం ఐదు రోజులే కానీ వర్షాలు మాత్రం కనుచూపు మేరలో కనపడటం లేదు. పైగా వర్షాలు సరిగ్గా లేకపోవటం వలన విత్తనాలు అంకురించటంలో కూడా దాని ప్రభావం ఉంటుంది. వరి, సోయాబిన్ పంటలు దీనివలన ఎక్కువ నష్టపోతున్నాయి.
మరో సమస్య రిజర్వాయర్ లలో కూడా సంవత్సరం మొదట్లో గత సంవత్సరం కంటే ఎక్కువ నీరు కనపడ్డా, ప్రస్తుతం 2013 కంటే తక్కువ స్థాయిలోకి పడిపోయాయి.
ఉల్లి ధర మళ్ళీ పెరిగింది. రమదాన్ సీజన్ వస్తుండటంతో పండ్లు కూడా ఆకాశాన్నంటే అవకాశం ఉంది. కూరగాయలు, పండ్ల ధరలు ముంబైలో ఇప్పటికే 20 శాతం వృద్ధి చెందాయి. ప్రస్తుత పరిస్థితిని విశ్లేషిస్తే వర్షపాతం తలకిందులుగా కిందికి పడిపోతుంటే ఆర్థిక మాంద్యం పైకి ఎగసే అవకాశం బాగా కనపడుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే కేంద్ర బడ్జెట్ లో ఇప్పటివరకు చేసిన కసరత్తులు, వేసిన అంచనాలు మారిపోయి కరువు బడ్జెట్ లోకి మారే అవకాశమూ కనిపిస్తోంది.
ఎంత నిజాయితీగా పనిచేసినా, ఎంత పట్టువదలకుండా పనిచేసినా ప్రకృతి కూడా సహకరించాలి కదా! ఐదు సంవత్సరాలలో మొదటి నాలుగు సంవత్సరాలు అభివృద్ధి కోసం కృషి చేసి చివరి సంవత్సరం పార్టీ ప్రాబల్యం కోసం పని చేస్తే చాలన్న ప్రధాని మోదీ సిద్ధాంతానికి దైవం కూడా సహకరిస్తే ఆయనకు పేరు అటుంచి దేశం బాగుపడుతుంది. వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన సంవత్సరం, ఆ పై సంవత్సరం కూడా వర్షాలు దండిగానూ, అదనులోను పడి పంటలు బాగా చేతికి రావటం ఆ ప్రభుత్వాన్నికి సహకరించింది. అలా లేనప్పుడు గణాంకాల్లో మార్పులు తేక తప్పదు మరి!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more