పెళ్ళవగానే హనీమూన్ కి ఎందుకు వెళ్తారంటే ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి, కొన్నాళ్లు ఎటువంటి పని ఒత్తిడిలూ లేకుండా హాయిగా గడుపుతూ జీవితంలో ముందడుగు వెయ్యటానికి సిద్ధమవటానికి. కానీ దానికీ ఓ లెక్కుంటుంది. ఇంకా మేము అర్థం చేసుకోలేదు అంటూ హనీమూన్ లోనే సగం జీవితం గడిపెయ్యటానికి వీలుండదు. అంతే కాదు హనీమూన్ లో ఇద్దరూ సఖ్యతగా లేకపోయినా, లేకపోతే ఇంటిదగ్గర వేరే సమస్యలు ఎదురైనా హనీమూన్ మధ్యలోనే అంతమౌతుంది.
అదే హనీమూన్ కొత్తగా ఎన్నికైన రాజకీయ నాయకుల విషయంలో ఆరు నెలలుంటుందంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 6 నెలల సమయం వరకు సత్ఫలితాలకోసం మామూలుగా అయితే వేచి చూడాలి. కానీ ఒక నెలలోనే దేశానికి కావలసినంత నష్టాన్ని మోదీ కలుగజేసారని, అందువలన ఇక చాలు మీ హనీమూన్, తిరిగి వెనక్కి రండని నరేంద్ర మోదీకి జోగి పిలుపునిచ్చారు.
మూలుగుతున్న సామాన్యమానవుడి మీద తాటికాయ వేస్తూ రైల్వే రేట్లను పెంచేసారని, నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయని అన్నారు. విదేశీ పెట్టుబడులను రక్షణ శాఖలాంటి కీలకమైన విభాగాలలో ప్రవేశపెట్టటం వలన దేశాన్నే అభద్రతకు లోను చేస్తున్నారని కూడా ఆయన అన్నారు. మొత్తం మీద మోదీ ఎన్నికల సమయంలో తాను చేసిన వాగ్దానాలకు పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని జోగి అభిప్రాయపడ్డారు.
ఛత్తీస్ గఢ్ లోని భాజపా ప్రభుత్వం గురించి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రాష్ట్రంలో సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని, 56 లక్షల కుటుంబాలకు జారీచేసిన రేషన్ కార్డ్ లు 70 లక్షలని ఆరోపించారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో రమణ్ సింగ్ ప్రభుత్వాన్ని విమర్శించిన అజిత్ జోగి పరిస్థితులను సరిచెయ్యటం కోసం మోదీని హనీమూన్ ని అంతంచేసి తిరిగి రమ్మని పిలుస్తున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more