(Image source from: YS Jagan accepts his failure in assembly )
అవును... చాలారోజుల తరువాత జగన్ తనకు సంబంధించిన ఒక నిజాన్ని బయటపెట్టారు. ‘‘ఎన్నికల ముందు నేను చేసింది ఓవర్ కాన్ఫిడెన్సే’’ అనే రీతిలో జగన్ ఈరోజు అసెంబ్లీలోని తన ప్రసంగంలో చెప్పుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేనే ఎన్నికవుతా’’నని ప్రచార నేపథ్యంలో జగన్ ఎన్నోసార్లు చెప్పుకున్నారు. అప్పట్లో ఈయన చేసిన వ్యాఖ్యలు, వ్యవహారాలను చూసి రాజకీయ విశ్లేషకులు తమ బలహీనతల గురించి పరీక్షించుకున్నారు కూడా! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తమ పార్టీయే గెలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసుకున్నారు. కానీ ఎన్నికల తరువాత అందరి బండ్ల టైర్లకు పంక్చర్ అయిపోయింది. తాము ప్రదర్శించింది ఓవర్ కాన్ఫిడెన్స్ అని తెలుసుకుని అందరూ నోళ్లవేలు పెట్టుకుని నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు.
ఇదే విషయాన్ని తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పుకున్నారు. ఎన్నికల ముందు తాము ప్రదర్శించిన ఓవర్ కాన్ఫిడెన్స్ అని సభాముఖంగా ఒప్పుకోక పోయినా... అందుకు భిన్నంగా జవాబిచ్చారు. ఆత్మవిశ్వాసమే తమను దెబ్బతీసిందని అందరి సమక్షంలోనే తన నోటితో నిజాన్ని వెళ్లగక్కుకున్నారు జగన్. అలాగే అత్యధిక మెజారిటీతో పార్టీని గెలిపించుకున్న చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా... ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ప్రతిపక్షాల మధ్య మాత్రమే గట్టి పోటీ జరిగిందని చెప్పారు.
అలాగే కాంగ్రెస్ బలహీనతల గురించి జగన్ బయటపెడుతూ... ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించడం చేసింది మొదటి తప్పు అయితే... రైతులకు రుణమాఫీలు చెల్లించకుండా మరొక తప్పు చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్రస్ లేకుండా కొట్టుకుపోయింది. నరేంద్రమోదీ హవా ఎక్కువగా వున్న నేపథ్యంలో... ఆయన చేసిన ప్రచారాల కారణంగానే తెలుగుదేశం పార్టీ గెలిచింది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘ప్రతిపక్షం అంటే అన్ని వ్యవహారాల్లోనూ వ్యతిరేకంగా వుండటం కాదు. మేము తెదేపా పార్టీకి అన్నివిధాలుగా మద్దతునిస్తాం. ఎన్నికల ముందు మేమిచ్చిన హామీలను చంద్రబాబు పూర్తి చేస్తారని నేను ఆశిస్తున్నాను’’ అని తన ప్రసంగాన్ని ముగించేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more