ఇప్పుడు తెరపైకి విచిత్రమైన ప్రశ్న ఒకటి వచ్చింది. ఈ ప్రశ్నతో తెలంగాణ విద్యార్థులకు కొత్త కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది. కేసిఆర్ సర్కార్ కొత్త చట్టం తీసుకురాబోతున్న తరుణంలో తెలంగాణలోని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ లో కేసిఆర్ సర్కార్ కొత్త అడుగులు వేస్తున్న సమయంలో.. కొన్ని వింత నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు ఎవరికి రాని ఆలోచనతో సరికొత్తగా ముందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుంది.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో ఫీజు రీఎంబర్స్ మెంట్ అన్ని ప్రాంతాల విద్యార్థులకు, అన్ని కులాల వారికి అందే విధంగా ప్రతిపాదన చేయటం జరిగింది. అదే విదంగా అమలు జరిగిన విషయం తెలిసిందే. అయితే కేసిఆర్ సర్కార్ మాత్రం కొత్త ఆలోచనతో.. తెలంగాణ విద్యార్థులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు విద్యార్థులకు చెల్లించే ఫీ రీఎంబర్స్ మెంట్ పాలసీలో విద్యార్థి స్థానికతను . విద్యార్థి తండ్రి ఇంటర్ నుంచి ఏడేళ్లు నాన్ స్టాప్ గా ఎక్కడ చదివితే ఆ ప్రాంతానికి లోకల్ అవుతారనే నిబంధన వుండేది. కానీ ఇప్పుడు తెలంగాణ లలో అలా కాదు. విద్యార్థి తండ్రి పుట్టిన ప్రాంతం ఆధారంగా ఫీజ్ రీఎంబర్స్ మెంట్ అమలు చేసే విధంగా కేసిఆర్ సర్కార్ సరికొత్త అడుగులు వేస్తుంది.
దీంతో..తెలంగాణ విద్యార్థలు.. ‘‘నాన్న ఎక్కడ పుట్టావ్ ’’అంటూ తల్లిదండ్రులను విద్యార్థులు అడిగే రోజలు తెలంగాణ వస్తున్నాయి. దీంతో తెలంగాణ విద్యార్థులకు పూర్తి న్యాయం జరుగుతుందని ..తెలంగాణ మంత్రులు, తెలంగాణ నేతలు, అధికారులు భావిస్తున్నారు. ఈ పథకం త్వరగా అమలు జరిగితే బాగుటుందని కేసిఆర్ కు తెలంగాణ మంత్రలు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ లోని కొంతమంది ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తండ్రి ఉద్యోగి రీత్యా ఇతర రాష్ట్రాల్లో ఉండి.. అక్కడ సంసారం చేసి పిల్లలను కంటే వారు తెలంగాణ బిడ్డలు కాదా? ఆ బిడ్డలకు పెళ్లైయితే పిల్లలు పుడితే వారు తెలంగాణ గడ్డమీద పుట్టినట్టు కదా? అని తెలంగాణలోని కొంత మంది ఉద్యోగులు ఆవేశం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ..ఒక తరం ప్రజలు పూర్తిగా నష్టపోతారని తెలంగాణ మేథావులు అంటున్నారు. తండ్రి ఆంద్రలో పుట్టి, తెలంగాణ అమ్మాయిని పెళ్లి చేసుకోని హైదరాబాద్ లో స్థిరపడిపోయిన వారి సంగతి ఏంటి? అలాగే ఆంద్ర అబ్బాయిని తెలంగాణకు ఇల్లారికం తెచ్చుకున్న కుటుంబాల సంగతి ఏమిటి? అంతేకాకుండా 70, 60, 50, సంవత్సరాల నుండి తెలంగాణలో స్థిరపోయిన ఇతరా రాష్ట్రాల ప్రజలు చాలా మంది ఉన్నారు. మరీ వారి కుటుంబాలు తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదా? అని నగరంలోని కొన్ని కుటుంబాలు కేసిఆర్ సర్కార్ పై మండిపడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more