కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి కుంభకోణాలు బయటపడుతున్నారు. కుంభకోణాలతో..అవినీతి సొమ్ము మెక్కిన నేతలు. భయంతో వణికిపోతున్నారు. రాజస్థాన్ లో జరిగిన అతిపెద్ద కుంభకోణం బయట పడింది. ఈ కుంభకోణంలో.. సచిన్ ఉన్నట్లు తెలుస్తోంది. సచిన్ అంటే.. క్రికెట్ దిగ్గజం , రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్క్ ర్ కాదులేండి. అంబులెన్స్ కొనుగోళ్ల స్కామ్ లో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్, మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం కొడుకు క్రాంతి ప్రమేయం ఉంది. అంబులెన్స్ స్కామ్ పై నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఎఫ్ ఐఆర్ దాఖలు చేసింది.
ఎఫ్ ఐ ఆర్ లో మాజీ సీఎం అశోక్ గెహ్లోట్, సచిన్ పైలెట్ , కేంద్రమాజీ మంత్రులు పి. చిదంబరం కొడుకు క్రాంతి, వయిలార్ రవి కొడుకు రవి కృష్ణ పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం క్రైం బ్రాంచ్ ఈ విషయమై దర్యాప్తు చేస్తోంది. సీబీ - సీఐడి చేత కానీ, సీబీఐ చేతకానీ దర్యాప్తు చేయించాలనే డిమాండ్ పెరిగింది.
2013లో మాజీ కేంద్రమంత్రి వయిలా ర్ రవి కొడుకు రవి కృష్ణ ఆధ్వర్యంలోని ఓ కంపెనీ - జిగిస్తా హెల్త్ కేర్ – సంస్థ రాజస్థాన్, బీహార్, పంజాబ్ –లలో 108 అంబులెన్స్ లు నడిపేందుకు టెండర్ అందుకుంది. కాగా, అంబులెన్స్ ల ఆపరేటింగ్ లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని రాజస్థాన్- హెల్త్ - డిపార్ట్ మెంట్ ఆడిట్ నివేదికలో స్పష్టమైంది. ప్రభుత్వానికి ఏకంగా 14 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు.
కేవలం రాజకీయ పరమైన పక్షపాతంతో జిగిత్స హెల్త్ కేర్ సంస్థకు కాంగ్రెస్ టెండర్ కట్టబెట్టిందని బీజేపీ ఆరోపిస్తోంది. చిదంబరం, పైలెట్ ఈ సంస్థ డైరెక్టర్ లుగా పనిచేశారని పేర్కొంది. కేసును సీబీ –సీఐడీ దర్యాప్తు చేస్తోంది.
అయినా మన సచిన్ కు పార్లమెంట్ ఇచ్చిన ఫండ్ ను తన నియోజక వర్గ ప్రజలకే వడటానికి సమయంలేద. ఇలాంటి కుంభకోణాలు ఎలా చిక్కుకుంటాడు. ఇప్పటి వరకు .. ఎలాంటి అవినీతి మచ్చలేని ఆటగాడు, రాజకీయ నాయకుడు ఒక్క సచిన్ టెండుల్క్ ర్ అని చెప్పవచ్చు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more