భింద్రన్ వాలా మరణించిన 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ నిన్న స్వర్ణమందిరంలో ఖాలిస్తాన్ నినాదం వినిపించింది.
ఖాలిస్తాన్ వాదులు భారత దేశం నుంచి విడిపోయి తమదంటూ ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకోవటం ఉద్యమాన్ని నడిపే ప్రయత్నంలో ఉన్నారు. అమృత్ సర్ పోలీస్ కమిషనర్ జితిందర్ సింగ్ ఔలాఖ్ చెప్పిన దాని ప్రకారం, ఐపిఎస్ అధికారి సిమ్రన్ జీత్ సింగ్ మాన్ తన అనుచరులతో కలిసి అకాలి తఖ్త్ లోని గర్భాలయం లో ఖాలిస్తాన్ నినాదాన్ని వినిపించటానికి చేసిన ప్రయత్నంలో హింసాకాండ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు కత్తులు దూసాయి. పోలీసులు కలుగజేసకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఖాలిస్తాన్ గురించి మాన్ ఇలా అన్నారు- "సిక్కులకు ఉన్నది ఒకటే డిమాండ్. అది ఖాలిస్తాన్ ఆవిర్భావం. న్యూక్లియర్ పవర్ తో చెలగాటమాడుతున్న ఇండియా, పాకిస్తాన్, చైనా మూడు దేశాలకు ఇది మధ్యలో బఫర్ లా ఉంటుంది. సిక్కుల దేశంలో అన్ని మతాలవారు సామరస్యంతో మెలగగలుగుతారు. సౌత్ ఆసియాలో శాంతి నెలకొంటుంది. త్వరలోనే ఖాలిస్తాన్ మ్యాప్ తయారు చేస్తాం. సౌత్ ఆసియాలో న్యూక్లియర్ యుద్ధానికి చోటులేని ప్రాంతం అదొక్కటే అవుతుంది. అన్ని మతాలవారు సిక్కులతోపాటు ప్రశాంతమైన జీవనాన్ని సాగించగలుగుతారు."
నిన్న ఆపరేషన్ బ్లూస్టార్ జరిగి 30 సంవత్సరాలైన సందర్భంగా స్వర్ణమందిరంలో ఏర్పాటు చేసిన ఫంక్షన్ లో మాన్ ఉపన్యాసం ఇవ్వదలచుకోగా శిరోమణి అకాలి దల్ కి, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ టాస్క్ ఫోర్స్ కి మధ్య కత్తులతో యుద్ధం మొదలైంది. అందులో శిరోమణ్ గురుద్వారా ప్రబంధక కమిటీ కి చెందిన ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులకు గురుద్వారాలోపలికి అనుమతి లేదు. కేవలం శిరోమణి ప్రబంధక కమిటీ టాస్క్ ఫోర్స్ కి మాత్రమే లోపల నియంత్రించగలుగుతుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more